Hyderabad GPO: గుడ్ న్యూస్.. ఇకపై 24/7 స్పీడ్ పోస్ట్ సేవలు
Hyderabad GPO (Image Source: Twitter)
హైదరాబాద్

Hyderabad GPO: గుడ్ న్యూస్.. ఇకపై 24/7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలు.. అధికారిక ప్రకటన విడుదల

Hyderabad GPO: హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్ (Hyderabad General Post Office – GPO)లో నేటి నుంచి (అక్టోబర్ 15) 24×7 స్పీడ్ పోస్టు బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం పోస్టాఫీసులో ప్రత్యేకంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రత్యేక నైట్ షిఫ్ట్ సేవలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ జీపీఓ ప్రత్యేక ప్రకటనను సైతం విడుదల చేసింది. నైట్ షిఫ్ట్ అందుబాటులోకి రావడంతో.. నిరంతరాయం స్పీడ్ పోస్ట్ సేవలు పొందవచ్చని తెలిపింది.  ఇకపై వినియోగదారులు ఏ సమయంలో నైనా డాక్యుమెంట్లు, పార్శిళ్లు పంపేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. వినియోగదారులు ఈ 24/7 సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ జీపీఓ తాజా ప్రకటనలో కోరింది.

Also Read: Shocking Video: బస్సు కిందపడబోయిన బైకర్.. హీరోలా కాపాడిన కానిస్టేబుల్.. ఎలాగో మీరే చూడండి!

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల తరహాలో ఇటీవల కాలంలో పోస్టాఫీసు తన సేవలను మరింత విస్తరించింది. ఉత్తరాల పార్శిల్స్ తో పాటు డబ్బు పొదుపునకు సంబంధించి అధునాతన స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే వెసుసుబాటును సైతం పోస్టాఫీసు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 333 పోస్టాఫీసుల్లో రైల్వే టికెబ్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పోస్టాఫీసు వర్గాలు ప్రకటించాయి.

Also Read: Viral Video: అడవి ఏనుగులతో.. ఆకతాయిల వెకిలి చేష్టలు.. నెటిజన్లు ఫైర్

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!