Hyderabad Cyber Crime: సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో చిక్కుకుని లక్షా 18వేల పోగొట్టుకున్న బాధితునికి హైదరాబాద్ సైబర్ పోలీసులు(Hyderabad Cyber Police) ఊరట కల్పించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి బాధితుని ఖాతా నుంచి నేరగాళ్లకు వెళ్లాల్సిన డబ్బును ఆపేశారు. సైబర్ క్రైం డీసీపీ దార కవిత (DCP Dara Kavitha) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీ మొఘల్ పురాలో నివాసముంటున్న 48 యేళ్ల వ్యక్తి మొబైల్ ఫోన్ కు ఆర్టీవో చలాన్ పేర ఓ ఏపీకే ఫైల్ వచ్చింది. అదేందో చూద్దామని ఆ వ్యక్తి ఫైల్ ను డౌన్ లోడ్ చేశాడు.
Also Read CM Hyd Tour: సీఎం రేవంత్ సిటీ టూర్కు ముహూర్తం ఫిక్స్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!
క్రెడిట్ కార్డు ద్వారా లక్షా 18వేల రూపాయల లావాదేవీలు
ఆ వెంటనే సదరు వ్కక్తి మొబైల్ ఫోన్ ఏపీకే ఫైల్ పంపించిన సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే బాధితునికి సంబంధించిన క్రెడిట్ కార్డు ద్వారా లక్షా 18వేల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా ఫోన్ కు మెసెజీలు వచ్చాయి. దాంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఎన్సీఆర్పీ పోర్టల్ పర్యవేక్షణ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఎ.శ్రీకాంత్ బాధితుని మొబైల్ ఫోన్ నుంచి ఏపీకే ఫైల్ ను డిలీట్ చేశాడు. ఆ తరువాత జరిపిన విచారణలో సైబర్ క్రిమినల్ బాధితుడు ఉపయోగిస్తున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా యాప్ ల నుంచి విలువైన వస్తువులకు ఆర్డర్ పెట్టినట్టుగా వెల్లడైంది.
ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీకాంత్ బాధితునికి చెందిన ఈ కామర్స్ అకౌంట్స్ లోకి వెళ్లి ఆ ఆర్డర్లన్నింటినీ క్యాన్సిల్ చేశాడు. అశోక్ నగర్ కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలాగే ఏపీకే ఫైల్ డౌన్ లోడ్ చేయగా అతని అకౌంట్ నుంచి 25,532 రూపాయల మేర ఆర్డర్లు పెట్టినట్టు తెలిసింది. దాంతో ఆ ఆర్డర్లను కూడా క్యాన్సిల్ చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితుల డబ్బు పోకుండా చూసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను డీసీపీ దార కవిత అభినందించారు.
Also Read: Aamir Khan Coolie: రజనీకాంత్ ‘కూలీ’లో నటించడం తప్పే అంటున్న అమీర్ ఖాన్!.. ఎందుకంటే?