Digital Arrest Scam
హైదరాబాద్

Digital Arrest Scam: బిగ్ అలెర్ట్.. ఆ అరెస్టులు చెల్లవ్.. అజాగ్రత్త ఉన్నారో ఇక అంతే!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Digital Arrest Scam: దేశంలో ఎక్కడా డిజిటల్​ అరెస్టులు ఉండవని హైదరాబాద్​ సైబర్​ క్రైం ఎస్సై ప్రణీత చెప్పారు. రకరకాలుగా మోసాలు చేస్తున్న సైబర్​ క్రిమినల్స్​ డిజిటల్​ అరెస్టుల పేరిట బెదిరించి డబ్బులు గుంజుతున్నారన్నారు. ఇలాంటి బెదిరింపు ఫోన్​ కాల్స్​ వస్తే ఏమాత్రం భయపడవద్దని సూచించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏయేటికాయేడు రెచ్చిపోతున్న సైబర్​ మోసగాళ్లు వేర్వేరు రకాలుగా జనాన్ని మోసం చేస్తూ ప్రతీ సంవత్సరం 7వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సైబర్​ మోసాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సైబర్​ క్రైం పోలీసులు ప్రజల వద్దకే వెళ్లి ఆయా నేరాలు జరిగే తీరును వివరిస్తున్నారు. ఇక, సైబర్​ క్రిమినల్స్​ ఇటీవలిగా డిజిటల్​ అరెస్టుల పేరుతో అవతలి వారిని భయపెట్టి లక్షల్లో డబ్బు గుంజుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులను టార్గెట్​ చేస్తున్న సైబర్ మోసగాళ్లు మీ పేర కొరియర్​ వచ్చింది..అందులో డ్రగ్స్​ ఉన్నాయని ఫోన్లు చేసి లక్ష్యంగా చేసుకున్న వారిని బెదరగొడుతున్నారు. ఇప్పటికే మీపై ముంబయి యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​ అధికారులు కేసులు నమోదు చేశారని అదరగొడుతున్నారు.

Also Read: CM Revanth on KCR: రాజకీయ కక్ష సాధింపు మీదా? మాదా?.. సీఎం రేవంత్ ఫైర్

ఆ వెంటనే పోలీస్​ యూనిఫాంలో ఉండే వ్యక్తులు వాట్సాప్​ వీడియో కాల్​ చేసి ఇదే విధంగా భయపెట్టి అరెస్టు కాకుండా ఉండాలంటే తాము చెప్పినట్టుగా చేయాలంటున్నారు. ఇదంతా నిజమే అని నమ్ముతున్న బాధితులు సైబర్ క్రిమినల్స్ చెప్పినట్టుగా లక్షల రూపాయలను వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్​ లోని గవర్నమెంట్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఎలక్ర్టానిక్స్​ లో నిర్వహించిన అవగాహనా సదస్సులో సైబర్​ క్రైం ఎస్సై ప్రణీత ఈ నేరాలపై అవగాహన కల్పించారు. దేశంలోని ఏ రాష్ట్ర పోలీసులు కూడా డిజిటల్​ అరెస్టులు చేయరని చెప్పారు. కొరియర్​ లో ఒకవేళ నిజంగా డ్రగ్స్​ లాంటివి ఉంటే పోలీసులే స్వయంగా వచ్చి విచారణ చేస్తారు తప్పితే ఫోన్లు చేసి భయ పెట్టరని తెలిపారు.

Also Read: Water Bell system: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాటర్ బెల్ వచ్చేసింది..!

ఇటువంటి కాల్స్​ వస్తే అస్సలు నమ్మవద్దని సూచించారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్​ లింక్​ పై అస్సలు క్లిక్​ చేయవద్దని చెప్పారు. క్లిక్​ చేసి లింక్​ ను ఓపెన్​ చేస్తే సైబర్​ నేరగాళ్లు ఫోన్​ ను హ్యాక్​ చేసి ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తం తమ అకౌంట్లలోకి ట్రాన్స్​ ఫర్ చేసుకుంటారన్నారు. ఓటీపీ నెంబర్లను కూడా ఎవ్వరితో షేర్ చేసుకోవద్దన్నారు. ఇంటి వద్ద నుంచే పని చేసుకునే అవకాశం కల్పిస్తాం ఇస్తామన్నా…మేం చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయన్నా ఏమాత్రం నమ్మవద్దన్నారు. పరిచయం లేని యువతుల నుంచి వచ్చే వాట్సాప్​ వీడియా కాల్స్​ కు స్పందించవద్దన్నారు. ముఖ్యంగా యువతులు దుస్తులు లేకుండా చేసే ఫోన్​ కాల్స్​ ను ఏమాత్రం పట్టించుకోవద్దని, వెంటనే కట్​ చేసేయాలన్నారు.

Also Read Bhatti Vikramarka: తెలంగాణ అప్పులపై కాగ్ సంచలన రిపోర్ట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

పది సెకన్లు మాట్లాడినా సైబర్​ క్రిమినల్స్​ దానిని రికార్డ్​ చేసి సోషల్​ మీడియాలో అప్ లోడ్​ చేస్తామని బెదిరించి డబ్బులు గుంజుతారన్నారు. ఇక, సైబర్​ క్రిమినల్స్​ చేతుల్లో మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930 నెంబర్ కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా చేసినట్టయితే డబ్బును కాపాడే అవకాశాలు ఉంటాయన్నారు. దీంటోపాటు 8712665171 నెంబర్​ కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.  కార్యక్రమంలో కానిస్టేబుళ్లు శ్రీకాంత్​, వినయ్​ పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?