Hyderabad Crime [image credit: free pic]
హైదరాబాద్

Hyderabad Crime:ఫైనాన్స్ ట్రిక్ అంటూ ఘరానా మోసం.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్..

Hyderabad Crime: ఇన్వెస్ట్​ మెంట్​ ఫ్రాడ్​ కేసులోని నిందితున్ని హైదరాబాద్​ సైబర్ క్రైం పోలీసులు(Police )అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి మొబైల్​ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత( DCP Kavitha )తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​ కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్​ కాల్​ వచ్చింది. తనను తాను టీనా మిట్టల్​ గా పరిచయం చేసుకున్న వ్యక్తి డబ్ల్యు33బార్​ క్లేస్ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు.

 Also Read: Khammam Collector: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులతో ప్రజలకు ఆరోగ్యం.. జిల్లా కలెక్టర్

తమ వాట్సాప్ గ్రూప్​ లో సభ్యునిగా చేరితే స్టాక్​ ఎక్స్​ ఛేంజ్​ లో పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇస్తామన్నాడు. తద్వారా దండిగా లాభాలు సంపాదించ వచ్చని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు వాట్సాప్​ గ్రూప్​ లో చేరి రెండు లక్షల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి ప్రయత్నించగా కుదరలేదు. దాంతో టీనా మిట్టల్​ కు ఫోన్ చేయగా పెట్టుబడిగా పెట్టిన రెండు లక్షలతోపాటు దానిపై వచ్చిన లాభాల్లో నుంచి అయిదు శాతం కమీషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశాడు.

దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ కే.మధుసూదన్​ రావు ఎస్సై కే.వెంకటేశ్​, హెడ్​ కానిస్టేబుళ్లు ఎం.ఏ.కరీం, మహేశ్వర్ రెడ్డి, కానిస్టేబుళ్లు సంపత్​, సందీప్​ లతో కలిసి విచారణ చేపట్టారు. తిలక్​ నగర్​ నివాసి ఫకీర్​ శ్రీనివాస్​ రెడ్డి ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించుకుని గురువారం అతన్ని అరెస్ట్​ చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ