Vanasthalipuram FCI Colony: వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీ ఫేజ్–2 లో తాను శాంక్షన్చేయించిన యూజీడీ పనులకు, తనకు సమాచారం లేకుండానే ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శంకుస్థాపన చేయడమేమిటని డివిజన్కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్పార్టీ డివిజన్ప్రెసిడెంట్కుట్ల నర్సింహ్మ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, అశోక్గౌడ్, నర్సింహ్మ గౌడ్,సాయికిరణ్లతో కలిసి ప్రెస్మీట్నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనస్థలిపురం డివిజన్ లోని ఎఫ్సీఐ కాలనీ నుంచి ఆర్టీసీ కాలనీ వరకు యూజీడీ పైప్లైన్ నిర్మాణానికి కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మధుయాష్కీ గౌడ్సహకారంతో వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డికి విన్నవించి తన లెటర్ప్యాడ్మీద రూ.55 లక్షలు శాంక్షన్చేయించానన్నారు. త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబును పిలిచి డివిజన్లో సుమారు రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
Raghurama Krishnam Raju: విచారణకు ప్రభావతి సహకరించాల్సిందే.. రఘురామ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
కానీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అభద్రతా భావంతో.. దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. కనీసం ప్రొటోకాల్పాటించకుండానే కొబ్బరి కాయలు కొట్టడం దుర్మార్గమన్నారు. సుధీర్రెడ్డి అన్ని డివిజన్ లలో వలే వనస్థలిపురంలో రాజకీయం చేస్తా.. అంటే ఊరుకునేది లేదని వెంకటేశ్వర్రెడ్డి మండిపడ్డారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన చిల్లర రాజకీయాలు మానుకుని, హుందాగా వ్యవహరించాలని వెంకటేశ్వర్రెడ్డి హితవు పలికారు. రేపటి నుంచి ఆయన బండారాలు ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు