HCA 200 Cr Scam( IMAGE credit twtter)
హైదరాబాద్

HCA 200 Cr Scam: హెచ్‌సీఏ కేసులో కీలక మలుపు.. సీఐడీ ఫోరెన్సిక్ ​ఆడిట్ నిర్వహణ

HCA 200 Cr Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​(హెచ్​సీఏ) అక్రమాల కేసులో సీఐడీ స్పీడ్​పెంచింది. జగన్మోహన రావు(Jaganmohan Rao) అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఖర్చయిన రూ.200 కోట్ల అంశంపై దృష్టి సారించింది. ఈ డబ్బును దేని కోసం ఖర్చు చేశారన్నది నిర్ధారించుకోవటానికి మరోసారి ఫోరెన్సిక్​ఆడిట్ జరిపించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో జగన్మోహన్(Jaganmohan Rao)​ అవినీతి లీలలకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Also Read: Bhatti Vikramarka: రైతన్నలకు గుడ్ న్యూస్.. రూ.16,691 కోట్ల సబ్సిడీతో ఉచిత కరెంటు

మాజీ మంత్రి కృష్ణాయాదవ్(Krishna Yadav) సంతకాన్ని ఫోర్జరీ చేయటం ద్వారా ఆయనకు చెందిన గౌలిపురా శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌లో సభ్యత్వం ఉన్నట్టుగా పత్రాలు సృష్టించిన జగన్మోహన్​రావు(Jaganmohan Rao) 2023, అక్టోబర్‌లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంట్లో జగన్మోహన్ (Jaganmohan Rao)తన సమీప ప్రత్యర్థి అమర్‌నాథ్‌పై ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఆ తరువాత అక్రమాలకు తెర లేపారు. జగన్మోహన్​అధ్యక్షునిగా వచ్చిన తరువాత హెచ్‌సీఏలో భారీగా నిధుల గోల్ మాల్ జరిగినట్టుగా తెలంగాణ క్రికెట్ సంఘం కార్యదర్శి గురవారెడ్డి ఇటీవల ఫిర్యాదు చేయగా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.

20 నెలల్లోనే..
జగన్మోహన్​(Jaganmohan Rao)హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఎన్నికై 2‌‌0 నెలలు కావస్తుండగా ఈ మధ్య కాలంలో బీసీసీఐ నుంచి రూ.240 కోట్ల నిధులు మంజూరైనట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. అయితే, ప్రస్తుతం హెచ్‌సీఏ ఖాతాలో కేవలం రూ.40కోట్లు మాత్రమే ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే 20 నెలల్లో రూ.200 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేశారు? అన్నది లెక్క తేల్చటానికే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు.

సీఐడీ దర్యాప్తులో వెల్లడి

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే జగన్మోహన్‌తోపాటు హెచ్​సీఏ కార్యవర్గంలో ఉన్న కొందరు నకిలీ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలను సొంతానికి మళ్లించుకున్నట్టుగా ఇప్పటికే సీఐడీ(Cid) దర్యాప్తులో వెల్లడి కావటమే. క్రికెట్ బాళ్లు, బకెట్ కుర్చీలు, జిమ్​ పరికరాలు ఇలా కొన్న ప్రతీ వస్తువుకు మార్కెట్ రేటు కంటే రెండు, మూడు రెట్ల ఎక్కువ మొత్తానికి బిల్లులు సృష్టించి స్వాహా చేసినట్టుగా నిర్ధారణ అయ్యాయి. వీటికి సంబంధించి తమకు ఇష్టమున్న వారికి కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి క్విడ్​ప్రో కో రూపంలో పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకున్నట్టుగా స్పష్టమైంది. ఇక, ఆయా జిల్లాల క్రికెట్ అసోసియేషన్ల(Cricket associationsకు సమ్మర్​క్యాంపులు నిర్వహించటానికి నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం కాగితాలపై మాత్రమే ఇచ్చినట్టుగా చూపించి ఆ డబ్బును కూడా దిగమింగినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తే జగన్మోహన్​రావు అవినీతి బాగోతానికి సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెల్లడి కాగలవని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

 Also Read: Supreme Court: వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?