HCU Land Issue(image credit:X)
హైదరాబాద్

HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?

HCU Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలను ప్రభుత్వం సీరియస్​ గా పరిగణిస్తోంది. ఏఐ సహాయంతో చేసిన ఈ వీడియోల వెనక ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై దృష్టిని సారించింది. వీటి వెనక ఎవరున్నా సరే కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోష​ల్​ మీడియాలో పలు వీడియోలు హల్​ చల్​ సృష్టించిన విషయం తెలిసిందే.

అక్కడున్న చెట్లను నరకటం వల్ల జింకలు, నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయంటూ కొన్ని వీడియోలను పలువురు అప్​ లోడ్​ చేశారు. ఏఐ సహాయంతో రూపొందిన ఈ వీడియోలు ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మేనకా గురుస్వామి చెప్పారు.

Also read: DGP jithender: అంకితభావంతో పని చేయాలి.. పోలీసులకు డీజీపీ జితేందర్ సూచనలు

కాగా, ఫేక్​ వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో పోలీసులు ఈ దిశలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకుడు క్రిశాంక్​, ధృవ్​ రాఠీ తదితరులపై కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం