HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?
HCU Land Issue(image credit:X)
హైదరాబాద్

HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?

HCU Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలను ప్రభుత్వం సీరియస్​ గా పరిగణిస్తోంది. ఏఐ సహాయంతో చేసిన ఈ వీడియోల వెనక ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై దృష్టిని సారించింది. వీటి వెనక ఎవరున్నా సరే కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోష​ల్​ మీడియాలో పలు వీడియోలు హల్​ చల్​ సృష్టించిన విషయం తెలిసిందే.

అక్కడున్న చెట్లను నరకటం వల్ల జింకలు, నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయంటూ కొన్ని వీడియోలను పలువురు అప్​ లోడ్​ చేశారు. ఏఐ సహాయంతో రూపొందిన ఈ వీడియోలు ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మేనకా గురుస్వామి చెప్పారు.

Also read: DGP jithender: అంకితభావంతో పని చేయాలి.. పోలీసులకు డీజీపీ జితేందర్ సూచనలు

కాగా, ఫేక్​ వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో పోలీసులు ఈ దిశలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకుడు క్రిశాంక్​, ధృవ్​ రాఠీ తదితరులపై కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!