తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Case Filed on Influencers: బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న 11మంది యూట్యూబ్ఇన్ ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో బుల్లితెర నటులు, బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రెటీలు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. మియాపూర్ మాతృ శ్రీనగర్ నివాసి వినయ్ వంగల (40) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. కాగా, తన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటానికి వినయ్ అమీర్ పేట ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.
ఇనిస్టిట్యూట్ లో తనతోపాటు శిక్షణ పొందుతున్న పలువురు యువకులు తరచూ బెట్టింగ్ యాప్ ల గురించి మాట్లాడుకుంటుండగా విన్నాడు. ఈ క్రమంలో కొన్ని వెబ్ సైట్లు, మొబైల్ అప్లికేషన్లను పరిశీలించిన వినయ్ వాటిల్లో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూ ట్యూబర్లను చూశాడు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వీళ్లే ఆ ప్రమోటర్లు…
వినయ్ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు ఇన్ ఫ్లూయెన్సర్లు ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేశయని సుప్రిత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ లపై బీఎన్ఎస్ 318(4)తోపాటు గేమింగ్ యాక్ట్ 3, 4 సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66డీ ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: Nizamabad Crime News: కన్నతల్లిని చంపిన కుమార్తె.. నిజామాబాద్ లో దారుణం..