Betting App Case: విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్లతో సహా 29 మందికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణను ఊపందుకుంది.
Also Read: Telangana Politics: బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన.. అహంకారం పోలేదు: మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్
ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులైన విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి సహా మొత్తం 29 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు అయింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ ఈ విచారణను చేపట్టింది. ఈ కేసు టాలీవుడ్లో సంచలనంగా మారడమే కాక, సోషల్ మీడియా, ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై చర్చలను రేకెత్తించింది.
Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
ఈ కేసులో ఎవరెవరున్నారు?
ఈ కేసులో మొత్తం 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు నిందితులుగా ఉన్నారు. వారిలో కొందరు:సినీ నటులు హీరో విజయ్ దేవరకొండ , రానా దగ్గుబాటి , విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ , మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రణీత, యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఉన్నారు.
Also Read: Telangana: తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్తో సీఎం చర్చలు
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు: శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మవతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల ,టేస్టీ తేజ, రీతూ చౌదరి, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, సుప్రీత ఉన్నారు.