Mahesh Babu: బాహుబలి, ఆర్ఆర్ఆర్ RRR లాంటి ఎపిక్లు తీసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఏ సినిమా తీస్తారా అని చాలా మంది ఎదురు చూశారు. సూపర్స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ను SSMB29 గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం “గ్లోబ్ట్రాటర్” అనే పేరుతో వైరల్ అవుతోంది. ఇది ఒక మాసివ్ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్, జేమ్స్ బాండ్ స్టైల్లో ఉంటుందని రాజమౌళి చెప్పారు. ఇండియన్ రూట్స్తో గ్లోబల్ ఫ్లేవర్ ఉండబోతుందని తెలుస్తుంది.
అయితే, ఈ రోజు సాయంత్రం SSMB29 కి సంబంధించి ” గ్లోబ్ట్రాటర్ ” ఈవెంట్ 7 గంటలకు జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఇది బాగా వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకున్న మహేష్ బాబు.. సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్
” ఈరోజు నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాను. నువ్వు గర్వపడతాయని తెలిసి, నాన్న ” అంటూ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కృష్ణతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ ను చూసిన ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక నెటిజన్స్ అయితే, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు నాన్న సూపర్ కృష్ణ వర్ధంతి రోజు గ్లోబ్ట్రోటర్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మీకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఈ రోజు మీ స్పీచ్ తో మీరు ఏడవకండి, మమ్మల్ని ఏడిపించకండి మహేష్ అన్న అని ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు
Also Read: Delhi Blast: ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది ఎక్కడ?, ఎంత డబ్బుతో?, కెమికల్స్ ఎక్కడివి?.. వెలుగులోకి అసలు!
