Akhanda 2: బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ 2’ తాండవం థియేటర్ల్ వద్ద పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వూ లో ‘అఖండ 2 తాండవం’ సినిమా విషయంలో సౌండ్ ఎందుకు ఆగిపోతుంది. అన్న ప్రశ్నకు థమన్ సమాధానం ఇచ్చారు. అసలు సౌండ్ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను అంతా మిక్స్ చేసిన తర్వాత డాల్బీ నుంచి ఓ ఇంజనీర్ వచ్చి ఎక్కడ ఎంత సౌండ్ ఉండాలి అని అతను నిర్ణయిస్తాడని, అందులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. డాల్బీ నుంచి వచ్చిన వారు ఎక్కడ ఎన్ని డెసిబల్స్ ఉండాలో వాళ్లకు చెబితే అదే విధంగా తాము మిక్స్ చేస్తామన్నారు. మరి ఎందుకు థియోటర్లలో మాక్సులు సరిగా పాడటంలేదు అని యాంకర్ అడగ్గా.. కొత్తగా వచ్చిన థియేటర్లలో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు. పాత థియేటర్లో అన్నీ మారుస్తున్నారు కానీ స్పీకర్లు మార్చడం లేదు. అందుకే ఇప్పుడు వచ్చిన సౌండ్ కి పాత సిస్టం ఆగిపోతున్నాయన్నారు. దీనికి ఉదాహరణగా.. ఓజీ సినిమా కు ఓ థియేటర్ కు వెళితే.. నెత్తురుకు మరిగిన అన్న తర్వాత సౌండ్ ఆగిపోయిందని.. తీరా లోపలికి వెళ్లి చూస్తే వారు వాడేవి అన్నీ పాతవి అని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
Read also-Shambala Movie: ‘శంబాల’ థియేటర్లో మంచి ఎక్సీపిరియన్స్ చేస్తారు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల..

