Friday, July 5, 2024

Exclusive

కన్నబిడ్డ మృతదేహాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి.. ఇదేనా రాజన్న పాలనా?

కన్నబిడ్డ మృతదేహాన్ని తండ్రి 8 కిలోమీటర్లు చేతుల్లో మోసుకెళ్లిన ఘటన ఏపీలో కలకలం రేపుతున్నది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడు ఈ నెల 8న మరణించాడు. స్వగ్రామానికి అంబులెన్స్‌లో బయల్దేరారు. మృతుడి స్వస్థలం అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలో ఉన్నది. కానీ, అంబులెన్స్ దారి సరిగా లేదని వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో కొత్తయ్య తన కొడుకు డెడ్ బాడీని చేతుల్లో పట్టుకుని కొండ పైకి నడుచుకుంటూ వెళ్లాడు.

ఈ ఘటన పై స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో అభివృద్ధి జరుగుతున్నా.. తమకు కనీసం సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆక్రోశించారు. కొత్తయ్య తన కొడుకు మృతదేహాన్ని మోసుకెళ్లుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనపై ఏపీ విపక్ష పార్టీలు స్పందించాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

Also Read: ఆలు లేదు.. చూలు లేదు..! టికెట్ లేకున్నా క్యాంపెయిన్ కోసం కసరత్తు!

అంబులెన్స్ వనిజ వద్ద దారి మధ్యలోనే కొత్తయ్యను వదిలిపెట్టి పోయిందని టీడీపీ పేర్కొంది. ఈశ్వరరావు మృతదేహాన్ని తండ్రి 8 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయవిదారక దృశ్యాలు బాధాకరంగా ఉన్నాయని తెలిపింది. వైసీపీ ప్రభుత్వం ఫీడర్ అంబులెన్స్‌లను మూలన పడేసి బాధ్యతారాహిత్యంగా, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని ఫైర్ అయింది.

కాగా, వైఎస్ షర్మిల కూడా అన్న జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వేయండని అడిగేవాళ్లకు ఇది చూసైనా కనువిప్పు కలగాలి’ అని ఆగ్రహించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించారని, సరైన వైద్యం ఎలాగూ అందటం లేదని, కనీసం చనిపోయాక డెడ్ బాడీని కూడా ఇంటికి చేర్చకోలేని దురవస్థలో ప్రజలు ఉన్నారని, ఇది అధికార పార్టీకి సిగ్గుచేటని విమర్శించారు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని ఈ ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇంకా రాజన్న వారసులం అని చెప్పుకుంటారని మండిపడ్డారు. రాజన్న పాలన ఇలానే ఉంటుందా? అని నిలదీశారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Crime news: విజయ్ మాల్యా పై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆదేశాలు జారీ చేసిన ముంబై స్పెషల్ కోర్టు రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని జారీ ఉద్దేశపూర్వకంగానే రుణ...

Land Encroachment: కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా!

ఫేక్ మనుషులు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు..! - జూబ్లీహిల్స్‌లో భారీ భూ మాయ - 6 ఎకరాల ల్యాండ్.. కబ్జాకు ప్లాన్ - దొంగ వారసులు, ఫేక్ డాక్యుమెంట్లతో స్కెచ్ - నిందితుల్లో సాహితీ లక్ష్మినారాయణ బంధువు - గులాబీల పాలనలో...

MLC Kavitha: బెయిల్ ఇవ్వలేం..

- కవిత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు - రెండు బెయిల్ పిటీషన్ల కొట్టివేత - సుప్రీం మెట్లేక్కే ఆలోచనలో కవిత Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్...