Teachers Tragedy: సంక్రాంతి సెలవులు అయిపోయాయి. యధావిధిగా పాఠశాలలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా పాఠశాలలకు హాజరు కావలసి ఉంది. దీంతో నల్గొండ(Nalgonda) నుండి ఓ కారులో తుంగతుర్తి(Thungathurthi) మండలం రావులపల్లి పాఠశాలలకు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అయిదుగురు కలిసి బయలుదేరారు. జాజిరెడ్డి గూడెం(jajireddy Gudem) వద్ద ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తుంగతుర్తి కేజీబీవీలో ఎస్ ఓ(SO) గా పనిచేస్తున్న కల్పన(Kalpana) అక్కడికక్కడే ఘటన స్థలంలోనే మృతి చెందింది.
Also Read: Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!
అదుపుతప్పి బోల్తా కొట్టడంతో..
ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్(Praveen), అన్నారం ప్రధానోపాధ్యాయురాలు సునీత(Sunitha), రావులపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు గీత(Geetha), తుంగతుర్తి కేజీబీవీ ఎక్కువగా పని చేస్తున్న కల్పనలు నల్గొండ నుండి తుంగతుర్తి ప్రాంతానికి కారులో బయలుదేరారు. ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కల్పన ఘటన స్థలంలోని మృత్యువాత చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గీత కూడా మృతి చెందారు. ఇద్దరు హెడ్మాస్టర్లు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో హెడ్మాస్టర్ తులసి(Thulasi), రావులపల్లి హెడ్మాస్టర్లకు కూడా గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read: Ap-TG Water Disputes: 30న నీటి పంపకాలపై కీలక భేటీ.. వాదనలు వినిపిస్తారా.. చేతులెత్తేస్తారా?

