Crime News: బెంగళూరులో ఉంటూ డ్రగ్స్ సప్లై​ లింక్..?
Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: బెంగళూరులో ఉంటూ డ్రగ్స్ సప్లై​ లింక్.. డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్!

Crime News: పక్కగా సేకరించిన సమాచారంతో సూరారం పోలీసుల డ్రగ్ పెడ్లర్లతోపాటు వాటిని వినియోగిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 45గ్రాముల బ్రౌన్​ ఎండీఎంఏ, 6గ్రాముల వైట్​ ఎండీఎంఏ డ్రగ్ తోపాటు 13గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్(DCP Koti Reddy)డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓల్డ్ బోయిన్​ పల్లి వాస్తవ్యుడైన రంజిత్ కుమార్​ (30) బేగంపేటలోని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. జీతం తక్కువగా ఉండటంతో రంజిత్ కుమార్ డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు.

మాదక ద్రవ్యాల దందా..

ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా బెంగళూరు(Benguluru)లో ఉంటూ డ్రగ్స్ సప్లయ్​ చేస్తున్న అశ్విన్​ తో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ తరువాత తన స్నేహితులైన నితీష్ కుమార్ యాదవ్(Yadav)​, నవీన్​ కుమార్(Naveen Kumar)​ లతో కలిసి మాదక ద్రవ్యాల దందా మొదలు పెట్టాడు. ఇటీవల ముగ్గరు కలిసి ఎండీఎంఏ, గంజాయి కావాలని అశ్విన్​ తో చెప్పారు. ఆ తరువాత నితీష్​ కుమార్ తన అకౌంట్​ నుంచి 48వేల రూపాయలను అశ్విన్ ఖాతాకు బదిలీ చేశాడు. సరుకు సిద్ధంగా ఉందని అతను చెప్పగా బెంగళూరు వెళ్లి ఎండీఎంఏ డ్రగ్​ తోపాటు గంజాయి తీసుకుని హైదరాబాద్ వచ్చారు. వీటిని డెలివరీ చేయటానికి ఇద్దరు రెండు కార్లలో సూరారంలోని గాయత్రీ రెసిడెన్సీ వద్దకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

Also Read: Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. దేశం వీడిన 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజనీర్లు.. కారణం ఏంటంటే?

రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లు

విచారణలో నితీష్ కుమార్​, నవీన్​ కుమార్​ లు వెల్లడించిన వివరాల ఆధారంగా రంజిత్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెగ్యులర్​ గా డ్రగ్స్​ కొంటున్న గాయత్రీ రెసిడెన్సీ నివాసి మహ్మద్ షారూఖ్​, నాగిరెడ్డి వెంకట శశిధర్​ రెడ్డి, కుంచాల శివబ్రహ్మ, కరిమెరక సాయికుమార్​, మేదరమెట్ల లక్ష్మీనందినిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మాదక ద్రవ్యాలతోపాటు రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 12.20లక్షలు ఉంటుందని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. డ్రగ్స్ దందా చేస్తున్న వారితోపాటు వినియోగదారులను పట్టుకున్న సూరారం స్టేషన్​ డీఐ బాల్ రెడ్డి, ఎస్​ఐ మురళీ గౌడ్​ తోపాటు సిబ్బందిని అభినందించారు.

Also Read: Sangareddy: ఆసుపత్రికి బయలుదేరిన పెద్దాయన.. మధ్యలోనే అనూహ్య రీతిలో మృత్యువు

Just In

01

Hydraa: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా.. ఆనందంలో స్థానికులు

45 Movie: సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న ‘ది 45’.. రిలీజ్ ఎప్పుడంటే?

GHMC: గాంధీ ఆస్పత్రి పరిసరాలలో దర్శనమిచ్చిన కుక్కలు.. కమిషనర్ సీరియస్!

Khudiram Bose Movie: తొలి చిత్రంతోనే దేశ చరిత్రను ఆవిష్కరించిన రాకేష్ జాగర్లమూడి.. ‘ఖుదీరాం బోస్’ ముచ్చట్లు

Nara Bhuvaneshwari: కార్యకర్తల పిల్లలకు చదువు చెప్పేందుకు విద్యా సంస్థలు: నారా భువనేశ్వరి