Crime News: సాధారణంగా అందరూ దేవుళ్ల ఫోటోలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే, ఓ గంజాయి పెడ్లర్ మాదక ద్రవ్యాలను దాచి పెట్టటానికి వాటిని ఉపయోగించాడు. అయినా, ఎక్సయిజ్ అధికారులు అతని గుట్టును రట్టు చేశారు. దేవుళ్ల చిత్రపటాల వెనక దాచి పెట్టిన 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్పేట ఇందిరానగర్ నివాసి రోహన్సింగ్ గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్టు తెలిసి ఎస్టీఎఫ్ సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.
ఓవైపు ఎక్సయిజ్సిబ్బంది తనిఖీలు చేస్తుంటే రోహన్ సింగ్ పూజ గదిలో పూజ చేయటం మొదలు పెట్టాడు. ఇళ్లంతా వెతికినా గంజాయి దొరకక పోవటం తాము సోదాలు చేస్తుంటే రోహన్ సింగ్పూజలు చేస్తుండటంతో ఎక్సయిజ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో దేవుళ్ల ఫోటోల వెనక తనిఖీ చేయగా 10 కిలోల గంజాయి పొట్లాల్లో దొరికింది. విచారణలో ఒరిస్సాకు చెందిన స్వప్న మండల్, రాజా వీర్ నుంచి గంజాయి కొని హైదరాబాద్(Hyderabad) తీసుకొచ్చి రోహిత్ తో కలిసి అమ్ముతున్నట్టుగా రోహన్సింగ్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎక్సయిజ్ అధికారులు స్వప్న మండల్, రాజా వీర్, రోహిత్ లపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read: Allu Aravind: రూ.100 కోట్ల స్కామ్లో అల్లు అరవింద్.. ఈడీ ప్రశ్నల వర్షం!
శివలాల్ నగర్లో మరో 10కిలోలు
ఇక, శివలాల్ నగర్లో నివాసముంటున్న సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరితా, మీనాబాయి కలిసి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్ అధికారులు వీరి ఇళ్లపై దాడులు చసి10.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వీరితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్న రాజ్వీర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.
బలరాం గల్లీలో
ధూల్ పేట ప్రాంతంలోని బలరాం గల్లీలో గంజాయి దందా జరుగుతున్నట్టు తెలిసి ఎక్సయిజ్అధికారులు దాడులు జరిపారు. పవన్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపి 2.186 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దుర్గాభవానీ, కౌశిక్ సింగ్, శ్వేతాబాయి, అఖిలేష్, పవన్ సింగ్, మనో సింగ్ లతో కలిసి పవన్ సింగ్ దందా నడిపిస్తున్నట్టుగా వెల్లడి కావటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు.
Also Read: Junior Movie: ‘వైరల్ వయ్యారి’ సాంగ్.. గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల దుమ్ములేపారు..