Medchal Crime: గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య..!
Medchal Crime (imagecredit:swetcha)
క్రైమ్, హైదరాబాద్

Medchal Crime: మేడ్చల్లో దారుణం.. గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య..!

Medchal Crime: గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో బుధవారం రాత్రి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్(Medhal) పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గౌడవెల్లి(Goudavelli)లోని హనుమాన్ ఆలయం సమీపంలో నివసిస్తున్న గోమారం లక్ష్మారెడ్డి(Gomaram Lakshmareddy) (42), వృత్తిరీత్యా పెయింటర్, తలపై తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.

గోర్రెల కాపరీ అయిన..

ప్రాథమిక దర్యాప్తులో, మృతుడు లక్ష్మారెడ్డి తన ఇంట్లో అద్దెకుంటున్న మలిగ లింగం (50), వృత్తిరీత్యా గొర్రెల కాపరితో కలిసి బుధవారం రాత్రి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసినట్లు తెలిపారు. గొడవ తీవ్రత పెరగడంతో నిందితుడు మలిగ లింగం(Maliga Lingam) గొడ్డలితో లక్ష్మారెడ్డి(Laxama Rddy) తలపై దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Also Read: Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!

Just In

01

Davos Summit: తెలంగాణ రైజింగ్ 2047కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్ధతు

GHMC Elections: గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

Illegal Admissions: ఇదెక్కడి విడ్డూరం.. 10వ తరగతి పూర్తవ్వకుండానే ఇంటర్ అడ్మిషన్లు!

Vijayasai Reddy: రాజకీయాలపై విజయసాయి రెడ్డి యూ-టర్న్.. సంచలన నిర్ణయం.. జగన్‌ కోర్టులో బంతి!

Arrive Alive Program: 100 మంది సర్పంచులతో ప్రతిజ్ఞ చేయించిన మెదక్ ఏఎస్పీ.. ఎందుకంటే