Godavari Express Robbery: ఇటీవలే చోరీలు ఎక్కువవుతున్నాయి. ఈ ఘటనలు రోజుకోకటి వెలుగులోకి వస్తుంది. తాజాగా, గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చెందిన బంగారం చోరీకి గురి కావడంతో బాధితులు సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్లో చేశారు.
Also Read: Hebah Patel: రాజ్ తరుణ్ అలాంటి వాడే.. ఆ సమయంలో చాలా ఏడ్చాను.. హెబ్బా పటేల్ కామెంట్స్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగరత్నం కుమారి గృహిణి వైజాగ్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి నగరానికి వస్తున్నది. మార్గమధ్యలో నాగరత్నం 11 తులాల బంగారం, నగలు ఉన్న బ్యాగును తీసుకుని తన బెర్త్ పై ఉంచి పడుకుంది. సోమవారం తెల్లవారుజామున రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత .. హ్యాండ్ బ్యాగ్లో బంగారం, నగదు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలిసులు ఈ చోరి ఎలా జరిగింది? పక్కన ఉన్న తీసి ఉంటారా ? లేక బయటి వాళ్ళు ఎవరైనా తీసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Leaders are Confused: గులాబీ గుబాళిస్తే.. కమలం పరిస్థితేంటి అయోమయంలో ఆ పార్టీ నేతలు