Cyber Crime: రిటైర్డ్ ప్రొఫెసర్‌ను.. బురుడికొట్టించిన సైబర్ కేటుగాళ్లు
Cyber Crime (Image Source: Freepic)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Cyber Crime: రిటైర్డ్ ప్రొఫెసర్‌ను.. బురుడికొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.78 లక్షలు లూటీ

Cyber Crime: సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్పపటికీ కొందరు వారి ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ను సైబర్ కేటుగాళ్లు బురిడి కొట్టించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి తెగబడ్డారు. ఏకంగా రూ. 78 లక్షల రూపాయలను ప్రొఫెసర్ నుంచి దోచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన ఎం.వీ.జీ.ఈ శర్మ విశ్రాంత ఉపాధ్యాయుడ్ని సైబర్ నేరస్తులు మోసం చేశారు. తొలుత ఆయనకు ఫోన్ చేసిన సైబర్ క్రిమినల్స్.. తమను తాము సీబీఐకి చెందిన ఐపీఎస్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. శర్మ వినియోగిస్తున్న మెుబైల్ ఫోన్ లోని సిమ్ కార్డులో సమస్య ఉన్నట్లు చెప్పారు. దానిని సరిచేస్తామని చెప్పి నమ్మించారు.

డిజిటిల్ అరెస్ట్ పేరుతో..

రిటైర్డ్ ప్రొఫెసర్ తో కొద్దిసేపు సంభాషించిన దుండగులు.. ఆ తర్వాత బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ భయపెట్టారు. దీనిని సరిజేస్తామని చెప్పి ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ అధికారులని నమ్మిన శర్మ.. డిజిటల్ అరెస్టుకు భయపడి వారు అడిగిన అన్ని వివరాలను ఆన్ లైన్ లో సమర్పించారు.

Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్ తప్పు చేశారు.. కుట్ర చేసి నన్ను పంపేశారు.. కవిత సంచలన కామెంట్స్

రంగంలోకి దిగిన పోలీసులు

అలా శర్మ నుంచి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించిన దుండగులు తమ చేతివాటం ప్రదర్శించారు. పలుమార్లు శర్మ ఖాతా నుంచి నగదును దోచేశారు. 13 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.78.60 లక్షలను ఖాతా నుంచి లూటీ చేశారు. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. భీమవరం 2 టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Maoists Arrest: ఏపీలో మావోయిస్టుల కలకలం.. ఏకంగా 31మంది అరెస్ట్.. పట్టించిన హిడ్మా డైరీ

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు