Attapur Crime(Image credit: Twitter)
క్రైమ్

Attapur Crime: హైదరాబాద్‌లో దారుణం..తలపై రాళ్లతో కొట్టి.. బాలుడి హత్య

Attapur Crime: హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిని దుండగులు తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారవేశారు. ఈ సంఘటన స్థానికంగా కళకళ రేపింది. ఈ దారుణ హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి గుర్తింపు కోసం దర్యాప్తు చేపట్టారు. బాలుడు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, దుండగుల ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Also Read: వేధింపులు.. అవమానాలు.. చివరకు ఇల్లాలి సూసైడ్..

స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, బాలుడి గుర్తింపు, హత్య వెనుక ఉన్న కారణాలు తెలియాల్సి ఉంది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?