Anantapur Crime: నా కూతుర్ని కొట్టేవాడు.. అమూల్య తండ్రి
Anantapur Crime (Image Source: Twitter)
క్రైమ్

Anantapur Crime: నా కూతుర్ని కొట్టేవాడు.. చెప్పుకోలేక ఎంతో క్షోభ పడింది.. అమూల్య తండ్రి

Anantapur Crime: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం పట్టణంలో డిప్యూటీ తహశీల్దార్ భార్య ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడేళ్ల కుమారుడి గొంతు కోసి ఆపై ఆమూల్య ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా చేస్తున్న భర్త రవితో కొంతకాలంగా అమూల్యకు విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కూతురు, మనవడి మరణంపై స్పందిస్తూ అమూల్య తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.

అమూల్య తండ్రి ఏమన్నారంటే?

గత సోమవారం నుంచి ఆదివారం వరకూ కర్నూలులోని తమ నివాసంలోనే అమూల్య ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం బయలుదేరి అనంతపురంకు వచ్చారని పేర్కొన్నారు. గత బుధవారం రాత్రి తన భార్య ముందే కూతుర్ని అల్లుడు కొట్టాడని ఆరోపించారు. చేయి చేసుకుంటున్న క్రమంలో తన భార్య వెళ్లి అడ్డుపడిందని తెలిపారు. చనిపోయే ముందు కూడా అమూల్య తనకు ఫోన్ చేసినట్లు తండ్రి పేర్కొన్నారు. భర్తతో ఉన్న విభేదాల గురించి చెప్పుకొని బాధపడిందని, అయితే సర్దుకుపోమ్మని తాను నచ్చజెప్పానని అన్నారు. తన కూతురు అమూల్యను డిప్యూటీ తహసీల్దార్ రవి అప్పుడప్పుడు కొట్టేవాడని.. ఆ విషయాలని తమతో చెప్పుకోలేక మానసికంగా ఎంతో క్షోభను  అనుభవించిందని ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.

‘వాడు అల్లుడు కాదు, వాడొక సైకో’

అంతకుముందు కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భర్త వేధింపులక కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు. వాడు అల్లుడు కాదు, సైకో అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెళ్లి నేపథ్యంలో రూ. 50 లక్షలు కట్నం ఇచ్చామని.. ఇంకా కావాలని కూతుర్ని వేధించేవాడని డిప్యూటీ తహసీల్దార్ రవిపై ఆరోపణలు చేశారు. తమ బిడ్డ, మనవడి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బిటెక్ టాపర్ అయిన కూతుర్ని.. దుర్మార్గుడైన వ్యక్తికి కట్టబెట్టి ఆమె గొంతు కోశామని ఆవేదనకు గురయ్యారు.

Also Read: CM Revanth Reddy: చైనా జపాన్‌ల స్థాయి అభివృద్ధే మన టార్గెట్: సీఎం రేవంత్ రెడ్డి

అసలేం జరిగిందంటే?

రవి అమూల్య జంట.. అనంతపురం పట్టణంలోని ఎల్ఐసీ కాలనీలో గల అపార్ట్ మెంట్ లో జీవిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గురువారం రాత్రి బిడ్డ గొంతు కోసి హత్య చేసిన అమూల్య.. ఆపై ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన రవి.. డోర్ కొట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అమూల్యకు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అపార్ట్ మెంటు వాసులకు, పోలీసులకు అతడు సమాచారం  ఇచ్చాడు. వారి సాయంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా కుమారుడు, భార్య విగతజీవులుగా కనిపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన అనంతపురం పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Imran Khan’s Son: ఇమ్రాన్ ఖాన్ మృతిపై వదంతులు.. పాక్ ప్రభుత్వానికి కుమారుడు స్ట్రాంగ్ వార్నింగ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?