Gold Rates Today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
December 28 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఆదివారం బంగారం ధరలు చూసుకుంటే స్థిరంగా ఉన్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 28, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల తగ్గిన ధరలపై ఆశ పెట్టుకున్న కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 28, 2025)

డిసెంబర్ 28 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
వెండి (1 కిలో): రూ.2,74,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
వెండి (1 కిలో): రూ.2,74,000

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
వెండి (1 కిలో): రూ.2,74,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
వెండి (1 కిలో): రూ.2,74,000

వెండి ధరలు

గత కొద్దీ రోజుల నుంచి వెండి ధరలు పరుగులు పెడుతుంది. ఇక శనివారం ఒక్క రోజే రూ. 20,000 పెరిగింది. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,54,000 గా ఉండగా, రూ. 20,000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,74,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్:రూ.2,74,000
విజయవాడ: రూ.2,74,000
విశాఖపట్టణం:రూ.2,74,000
వరంగల్: రూ.2,74,000

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?