Roja On Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)కు అధికారులు భజన బ్యాచ్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ తానా అంటే.. పోలీసులు తందానా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం మెసేజ్ ఇస్తున్నారు?
ఏపీలోని పోలీసు వ్యవస్థ ఎటు పోతోందంటూ మాజీ మంత్రి రోజా (Roja Selvamani) ప్రశ్నించారు. ఖాకీ చొక్కాలు ధరించాల్సిన వారు.. ఇవాళ పసుపు చొక్కాలు వేసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని రోజా ఆరోపించారు. ఇలా ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టుకుంటూ వెళ్తూ.. ఏం మెసేజ్ ఇస్తున్నారని నిలదీశారు. రాబోయే రోజుల్లో దీనికి పదింతలు చేయమని పరోక్షంగా సూచిస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలను భ్రష్టపట్టిస్తున్నారని మండిపడ్డారు.
లోకేష్ తానా అంటే పోలీసులు తందానా అంటున్నారు : రోజా
పసుపు చొక్కాలు వేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు
రాజకీయాల్ని పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నారు
రాబోయే రోజుల్లో దీనికి రెండింతలు చేయమని సందేశం ఇస్తున్నారా?
– మాజీ మంత్రి ఆర్కే రోజా pic.twitter.com/WcLQazkj6I
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2026
‘ప్రభుత్వం తప్పు చేస్తోంది’
వైసీపీ అధినేత జగన్ (YS Jagan) చెప్పిన విధంగా గత పాలనలో తాము ఎవరి జోలికి వెళ్లలేదని రోజా పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టకుండా పాలన సాగించామన్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పు అని రోజా విమర్శించారు. దీనికి పదింతలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
‘సీఎం, హోమంత్రి సిగ్గుపడాలి’
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోతోందని రోజా విమర్శించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన పోలీసు ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) 36వ స్థానంలో నిలిచిందని అన్నారు. దీనికి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత (Home Minister Anita) సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. మన పోలీసు వ్యవస్థను చూసి భారత దేశంలో అందరూ నవ్వుకుంటారన్న ఆలోచన వారికి రావాలని పేర్కొన్నారు. అటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ లోనూ రాష్ట్ర పోలీసు వ్యవస్థ చిట్ట చివరి స్థానానికి పడిపోయిందని రోజా ఆరోపించారు.
Also Read: Nizamabad district Crime: రాష్ట్రంలో ఘోరం.. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం.. భర్తను అతి దారుణంగా..!
‘రాయలసీమ ద్రోహి’
ప్రజలకు వెన్నుపోటు పొడవటం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రోజా విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation) ప్రాజెక్టులోనూ చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మంచిన రాయసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారా? అంటూ రోజా ప్రశ్నించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పైనా రోజా ఫైర్ అయ్యారు. రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే.. మీరు కత్తి అందిస్తున్నారా? అంటూ పవన్ ను ప్రశ్నించారు.
చంద్రబాబు, నీకు రాయలసీమ ఏం ద్రోహం చేసింది అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు వెన్నుపోటు పొడుస్తున్నావు?
ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పిన పవన్ కళ్యాణ్.. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు?
చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే, నువ్వు కత్తి… pic.twitter.com/6H9ZIHK9ba
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2026

