Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు బెట్టింగ్ యాప్‌లు!
Constable Incident (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!

Constable Incident: ఇటీవలే సంగారెడ్డిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య

అప్పులపాలై రికవరీ చేసిన బంగారాన్నిఅమ్ముకున్న అంబర్​‌పేట ఎస్​ఐ
తాజాగా హైడ్రా కమిషనర్ గన్​‌మెన్​ ఆత్మహత్యాయత్నం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆన్​‌లైన్ బెట్టింగ్ యాప్ లు పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దురాశ దు:ఖానికి చేటు అని తెలిసినా బెట్టింగులు కాస్తూ కష్టార్జితాన్ని పోగొట్టుకుని, అప్పుల పాలవుతున్నారు. ఆ తరువాత వాటి నుంచి బయట పడలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు నేరాల బాట పడుతున్నారు. ఇటీవలి కాలంలోనే ఓ కానిస్టేబుల్​ బెట్టింగ్​ యాప్​ ల కారణంగా ఆత్మహత్య చేసుకోగా…తాజాగా మరో కానిస్టేబుల్​ ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఇక, ఎస్ఐ స్థాయి అధికారి చేసిన అప్పులు తీర్చటానికి ఏకంగా ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని అమ్ముకున్నాడు.

డిపార్ట్‌మెంట్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఈ ఉదంతాలతో పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం కలవరం వ్యక్తమవుతోంది. ఆన్ లైన్​ బెట్టింగ్ యాప్​ ల జోలికి వెళ్లకండి…జీవితాలను ఆగం చేసుకోకండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు తరచూ ప్రజలను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో ఆన్​ లైన్​ బెట్టింగ్ యాప్​ లపై సోషల్​ మీడియా ద్వారా ఓ ఉద్యమాన్నే నడిపించారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు శాఖలో పని చేస్తున్న వారిలోనే కొందరు ఈ ఆన్​ లైన్​ బెట్టింగులకు అలవాటు పడటం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. లక్కు తగిలితే లక్షలు సంపాదించ వచ్చని ఆశపడుతున్న వీళ్లు బెట్టింగులు పెడుతూ నిండా మునుగుతున్నారు.

Read Also- SIR in Telangana: తెలంగాణలో ‘సర్’.. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కీలక ప్రకటన

అయినా, అలవాటును మానుకోలేక అందినకాడ అప్పులు చేస్తున్నారు. ఆ తరువాత వాటిని తీర్చలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్​ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. 2024వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన సందీప్​ సంగారెడ్డి పోలీస్​ స్టేషన్ లో కానిస్టేబుల్​. ఆన్ లైన్​ బెట్టింగ్​, గేమ్స్​ కు అలవాటు పడి లక్షల రూపాయలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేయటం మొదలు పెట్టటంతో ఏం చేయాలో పాలుపోక గతనెల 3న మహబూబ్ సాగర్​ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైడ్రా కమిషనర్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్​ కృష్ణ చైతన్య కూడా ఆన్‌లైన్​ బెట్టింగుల కారణంగా అప్పులపాలై సర్వీస్​ రివాల్వర్​ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించినట్టుగా వార్తలొచ్చాయి. అంబర్ పేట స్టేషన్​ లో ఎస్​ఐగా పని చేసిన భానుప్రకాశ్​ ఇలాగే బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకోవటంతోపాటు అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చుకోవటానికి ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న నాలుగు తులాల బంగారాన్ని బాధితులకు తిరిగి ఇవ్వకుండా అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. కాగా, తన సర్వీస్​ రివాల్వర్ ను సైతం భానుప్రకాశ్​ అమ్ముకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

Read Also- Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?