Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ విడుదల
Mavoiest-Party-Letter (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Hidma Encounter: చికిత్స కోసం విజయవాడ వెళ్తే చంపేశారు.. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ

Hidma Encounter: మావోయిస్టు టాప్ కమాండర్, భద్రతా బలగాలు ఎన్నాళ్లగానో వెతుకుతున్న మాడ్వి హిడ్మాను (Madvi Hidma) ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలు ఇటీవలే ఎన్‌కౌంటర్ (Hidma Encounter) చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇదొక హత్య అంటూ మానవ హక్కుల సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ గురువారం (నవంబర్ 20) నాడు విడుదల చేసిన సంచలన లేఖ శుక్రవారం (నవంబర్ 21) నాడు వెలుగులోకి వచ్చింది. నిరాయుధుడిగా ఉన్న హిడ్మా, ఆయన భార్య రాజేతో పాటు మరికొందర్ని నవంబర్ 15న విజయవాడలో పట్టుకొని, మారెడుమిల్లి (Maredumillu) తీసుకెళ్లి క్రూరంగా హత్య చేసి, ఎన్‌కౌంటర్ చేసినట్టుగా నమ్మించారని ఆరోపించారు. కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న హిడ్మాది ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌, మరికొందరు మావోయిస్టులను కూడా ఇదేవిధంగా పట్టుకుని హత్య చేసి, రంపచౌడవరం ఏరియాలో ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా కట్టుకథ అల్లారని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖలో ఆరోపించారు.

Read Also- Lifetime Free Credit Card: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా?, కోటక్ మహీంద్రా బ్యాంక్ బంపరాఫర్.. కానీ, ఒకే ఒక్క రూల్

చికిత్స కోసం విజయవాడకు హిడ్మా

కామ్రేడ్ హిడ్మా, ఆయన భార్య కామ్రేడ్ రాజే, కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని, చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం కారణంగా పోలీసులకు స్పష్టమైన సమాచారం చేరిందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కనుసన్నల్లో ఆంధ్ర ఎస్ఐబీ నవంబర్ 15న వీరిని తమ అదుపులోకి తీసుకుని, లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమైందని, క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం ఇవన్నీ పచ్చి అబద్దాలని లేఖలో అభయ్ పేర్కొన్నారు.ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తోందని పేర్కొన్నారు. కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ రాజేలకు శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్టు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన మిగతావారికి కూడా శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నట్టు పేర్కొంది. వీళ్లు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తోందని లేఖ ద్వారా తెలిపారు.

Read Also- Rupee All Time Low: ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి దిగజారిన రూపాయి విలువ.. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

23న దేశవ్యాప్త నిరసన దినం

ఈ క్రూర హత్యకాండలకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నామని మావోయిస్టు కేంద్రకమిటీ పేర్కొంది. దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని, నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.

5వ తరగతి వరకు చదువుకున్న హిడ్మా

కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా, పువ్వర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో, ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారని అన్నారు. చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడని అన్నారు. 1997 డిసెంబర్‌లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయ్యి, 1998 చివరి వరకు బాసగూడ దళంలో పనిచేశాడని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖలో పేర్కొన్నారు. 1999లో గడ్చిరోలీలో పనిచేశారని, తర్వాత ఒక ఏడాది కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేశాడని పేర్కొన్నారు. 2001లో ఏరియా కమిటీ సభ్యుడయ్యి, దక్షిణ బస్తర్‌కు వచ్చాడన్నారు.

2002లో ఊసూర్ ఎల్‌వోఎస్ కమాండర్‌గానూ, కొద్దికాలం కుంట ఎల్ఎస్ కమాండర్‌గా పనిచేశాడని తెలిపారు. ‘‘2005లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. తరువాత కంపెనీ-2లో పీఎల్ కమాండర్‌గా పనిచేశాడు. 2006 నుంచి 2009 వరకు కంపెనీ-3 కమాండర్‌గా, కార్యదర్శిగాను పనిచేశారు. 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుంచి బెటాలియన్ కమాండర్‌గా పనిచేశాడు. 2011లో బీఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2020లో సెక్రటేరియట్ సభ్యుడయ్యాడు. 2024 ఆగస్టులో ఎస్‌జెడ్‌సీ కార్యదర్శిగా, కేంద్రకమిటీ సభ్యుడిగానూ ప్రమోట్ అయ్యాడు’’ అని లేఖలో మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?