Hyderabad Crime: అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కా తమ్ముడు చనిపోయారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన మీర్ చౌక్ పోలీస్ (Police) స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్ పుర నూర్ ఖాన్ బజార్ వాస్తవ్యురాలైన సర్వరీ బేగం (90) వికలాంగురాలు. ఆమె తమ్ముడు షకీల్ (80). ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. వికలాంగురాలైన అక్క బాగోగులు చూసుకుంటున్న షకీల్ ఆమెతో కలిసి నలభై ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాడు.
ఈ ఇద్దరు సహజంగా చనిపోయారా?
కాగా, వాళ్లు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఇద్దరు సహజంగా చనిపోయారా? ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Hyderabad Crime: అల్వాల్లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!

