Ramachandra Naik: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా
Ramachandra Naik ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Ramachandra Naik: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది : ఎమ్మెల్యే రామచంద్రనాయక్!

Ramachandra Naik: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ (Ramachandra Naik) పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరిపెడ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: Ramachandra Naik: తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించాలి : జాటోత్ రామచంద్రనాయక్

వారి మేధోకృషితోనే

ఈ సందర్భంగా డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల అపార త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి మౌలిక సూత్రాలతో భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిరంతరం వర్ధిల్లుతుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ, దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Student Indiscipline: పాఠశాలకు డుమ్మా ఆపై.. అల్లరి చేష్టలకు పాల్పడుతున్న విద్యార్థులు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?