Medchal: ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షవిదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భాదితుడికి 2000 రూపాయల జరిమానాతో పాటు రేండేళ్ల జైలుశిక్షను అమలు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
పూర్తివివరాలిలా..
2017 వ సంవత్సరంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట(Mallam Kunta) గ్రామానికి చెందిన టీ. నర్సింహారెడ్డి(T. Narasimha Reddy) అనే వ్యక్తి వాచ్మన్ కూతురైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మేడ్చల్ కోర్టు(Medchal Cort) శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను స్పెషల్ పీపీ ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) మీడియాకు తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం మేడ్చల్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేష్(Venkatesh) నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. ఈ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station)లో నమోదు కాగా, బాధితురాలికి భరోసా సెంటర్ లీగల్ అడ్వకేట్ రోజా(Roja) సహకారంతో న్యాయ సహాయం అందించబడింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితుడిపై శిక్ష ఖరారు చేసింది.
Also Read: Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. సంఘటన పై అనుమానాలెన్నో..?

