CM Chandrababu: 'గొడవలే కావాలంటున్నారు'.. చంద్రబాబు ఫైర్!
CM Chandrababu (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: నీళ్లా, గొడవలా అంటే.. గొడవలే కావాలంటున్నారు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్!

CM Chandrababu: నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే కొంతమంది నీళ్లొద్దు గొడవలే కావాలంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మండపేట నియోజకవర్గం రాయవరంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ కు చురకలు అంటించారు. తెలుగు జాతి మద్య విద్వేషాలు వద్దని చంద్రబాబు అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడని.. జగన్ పేరు ప్రస్తావించకుండానే చంద్రబాబు అన్నారు. వాళ్లకి నీళ్లు వద్దని గొడవలే కావాలని మండిపడ్డారు. తనకు మాత్రం గొడవలు కాదు.. జాతీ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

జగన్ ఫొటోలు ఎందుకో..

గత వైసీపీ హయాంలో రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోలు ఎందుకు వేశారో తనకు అర్థం కాలేదని చంద్రబాబు అన్నారు. దానిని ప్రమాదకరమైన ఆలోచనగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే మీ భూమి – మీ హక్కు అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చాని చంద్రబాబు గుర్తుచేశారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర వేసి మళ్లీ ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు దానిని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 11వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లెల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసిన పాస్ బుక్ లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

రాజధాని వ్యాఖ్యలపై కౌంటర్..

మరోవైపు అమరావతి రాజధానిపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెున్నటి వరకూ మూడు ముక్కలాట ఆడారని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహాలో రాజధానులు లేవని చెప్పినా వినలేదని పేర్కొన్నారు. ఆనాడు చేసిన పనులకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మళ్లీ ఇప్పుడు వచ్చి సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బెంగళూరు వెళ్తే అదే రాజధాని అవుతుందా? ఇడుపులపాయలో ఉంటే దాన్నే క్యాపిటల్ అనుకోవాలా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

Also Read: AP Telangana Water Dispute: మేం వివాదాలు కోరుకోం.. పక్క రాష్ట్రం అడ్డుపడొద్దు.. నీటి వివాదంపై సీఎం రియాక్షన్

దిల్లీ, లండన్ నది పక్కన లేవా?

అమరావతి రాజధాని.. నది పక్కనే ఉందన్న జగన్ వ్యాఖ్యలను సైతం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. రాజమండ్రి, విశాఖపట్నం, దిల్లీ, చెన్నై, ముంబయి, లండన్ నగరాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని నిలదీశారు. కనీస పరిజ్ఞానం లేని వారు కూడా రాజకీయాలు చేస్తే ఇంకేం మాట్లాడాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు రాజ్యాంగంలో అమరావతి పేరు కూడా లేదని జగన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారని జగన్ పై సీఎం ధ్వజమెత్తారు.

Also Read: DCM Pawan Kalyan: ‘సినిమా ఫ్లాప్ అయినా.. డబ్బు వచ్చే స్టార్ డమ్ నాది’.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?