Archery Training: పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం మరియు క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో, సాధుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్(Sadhula Muthayya Memorial Charitable Trust) ఆధ్వర్యంలో జనవరి 11 నుండి 18 వరకు మహబూబాబాద్(Mahabubabad)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఒక ప్రత్యేక విలువిద్య (ఆర్చరీ) శిక్షణ శిబిరం నిర్వహించబడుతోంది. ఈ శిబిరాన్ని శ్రీ సారంగ పాణి సాదుల మరియు శ్రీ పుట్ట శంకరయ్య సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది.
శిక్షణ సమయాలు
ఉదయం: 6:00 నుండి 9:00 గంటల వరకు
సాయంత్రం: 4:00 నుండి 6:00 గంటల వరకు.
Also Read: Constable Family: కానిస్టేబుల్ కుటుంబానికి 1.31 కోటి రూపాయల చెక్కు అందించిన డీజీపీ
ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు
విలువిద్య క్రీడ పిల్లల్లో మానసిక స్థిరత్వం, సహనం, ఏకాగ్రత, శారీరక సమన్వయం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొబైల్ ఫోన్లు(Mobile Phones), టీవీ(TV)లకు దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన జీవనశైలికి పిల్లలను అలవాటు చేస్తుంది. అంతేకాకుండా, ఈ క్రీడ ద్వారా క్రీడా కోటా, స్కాలర్షిప్లు(Scholarships), ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మరియు పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని గుర్తించి, తమ పిల్లలను ఈ శిబిరంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్లోనే ఇలాంటి శిక్షణ అందుబాటులో ఉండటం అరుదైన అవకాశం అని, “క్రీడల ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం – ఏకాగ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిద్దాంమిన అన్నారు.
Also Read: TG Vehicle Registration: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్టీవో ఆఫీసుతో పనిలేదు.. నేరుగా ఇంటికే ఆర్సీ!

