MLA Rajesh Reddy: గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి (MLA Rajesh Redd) అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి ముఖ్యమంత్రి కప్ (సీఎం కప్) టార్చ్ ర్యాలీని కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి టార్చిని వెలిగించి ఎమ్మెల్యే రాజేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం సి.యం కప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం లభించడమే కాకుండా, అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుందని తెలిపారు.
పట్టుదలతో శ్రమిస్తే ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగవచ్చు
కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ… పల్లె స్థాయి నుండి వచ్చిన క్రీడాకారులు పట్టుదలతో శ్రమిస్తే ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగవచ్చని, దానికి సి.యం కప్ వంటి వేదికలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సి.యం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి, జిల్లాలోనే కాక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Also Read: MLAs Defection Case: ముగిసిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేన్.. తిరిగి మల్లీ ఈ నెల 24న విచారణ

