Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ
Mahesh Kumar Goud ( image credit: swetcha reporter)
Political News

Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే కాంగ్రెస్ లక్ష్యం : పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్!

Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 8న గాంధీ భవన్‌లో ప్రత్యేకంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అసెంబ్లీలో ఆహ్వానించారు. పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్స్‌పై ఇద్దరు నేతలు సుమారు గంటకు పైగా చర్చించారు.

Also Read: Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి: మహేష్ కుమార్ గౌడ్

అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలి

కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం, పేరు మార్చడంపై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కృష్ణ, గోదావరి జలాల పీపీటీ విషయం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను సీఎంకు పీసీసీ చీఫ్​ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో డివిజన్, వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి వార్డు, డివిజన్ల నుంచి ఆరుగురి చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి సరైన వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇవే అంశాలపై టీపీసీసీ విస్తృత స్​థాయి సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Also Read: Mahesh Kumar Goud: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం : పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్

Just In

01

The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Hyderabad Police: ఆహార కల్తీని హత్యాయత్నంగానే పరిగణిస్తాం.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: వైఐఐఆర్‌సీ మొద‌టి విడుత‌లో బాలిక‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి!

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!