Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి
Phone Tapping Case ( IMAGE Credit: swetcha reporter)
Political News

Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్!

Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్​ గతంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేయించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, తనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్‌ను కొట్టివేయాలని హరీశ్​ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Also ReadPhone Tapping Case: నేడు సాయంత్రం సీపీతో సమావేశం కానున్న సిట్ బృందం!

హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను స్క్వాష్ చేస్తూ ఉత్తర్వులు

ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను స్క్వాష్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. హరీశ్ రావు విచారణకు అనుమతించాలని అందులో కోరింది. చక్రధర్ గౌడ్‌ను సైతం ప్రతివాదిగా చేర్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనున్నది.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విచారణకు రంగం సిద్ధం!

Just In

01

BRS Corporators: బీఆర్ఎస్‌కు ఝలక్.. కాంగ్రెస్‌లోకి ఖమ్మం కార్పొరేటర్లు క్యూ.. సీఎం సమక్షంలో చేరికలు

Couple Friendly: సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు.. ఎప్పుడంటే?

Anil Sunkara: ఆ రెండు సినిమాలు ప్లాప్ తర్వాత నిర్మాత ఏం చేశాడంటే?.. రూ.80 కోట్లు నష్టం..

Transport Department: రవాణా శాఖకు భారీగా ఆదాయం.. 9 నెలల ఎన్ని కోట్లు సమకూరిందంటే?

GHMC: కొత్త ఆఫీస్‌ల ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ బిజీ బిజీ.. ప్రాంగణాల కోసం అన్వేషణ!