Crime News: భార్య కొడుకును కిరాతకంగా హత్య చేసి భర్త
Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: భార్య కొడుకును కిరాతకంగా హత్య చేసి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Crime News: కట్టుకున్న భార్య.. కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా హత్య చేసిన వ్యక్తి ఆ తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా కొల్లూరు ప్రాంతంలోని జేపీనగర్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆడుకుంగటున్న బాలుడు

జేపీనగర్ లో నివాసముంటున్న చంద్రకళ (30), శివరాజ్ భార్యాభర్తలు. వీరి కుమారుడు రేవంత్ (14). ఇటీవలే శివరాజ్ భార్య, కుమారునితో కలిసి జేపీనగర్ వచ్చి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కాగా, గురువారం వీరి ఇంటి పక్కనే ఉంటున్న కుటుంబంలోని బాలుడు ఆడుకోవటానిని రేవంత్​ ను పిలిచేందుకు ఇంట్లోకి వెళ్లాడు. చూడగా శివరాజ్ గొంతు నుంచి రక్తం కారుతూ కనిపించింది.

Also Read: Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..

భార్య, కొడుకును చంపి..

భయపడ్డ బాలుడు పరుగున వెళ్లి ఇంట్లో వారికి విషయం చెప్పాడు. దాంతో స్థానికులు వచ్చి చూడగా శివరాజ్​(Shivaraj) స్పృహ తప్పి కనిపించాడు. బెడ్ రూంలో చంద్రకళ(Chendhrakala), రేవంత్(Revanth) చనిపోయి అగుపించారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే కొల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. చనిపోయిన చంద్రకళ, రేవంత్ ల మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం తరలించారు. శివరాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. శివరాజ్ తన భార్య, కొడుకును చంపి ఆ తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని భావిస్తున్నారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: Panchayat Election: ఖర్చులు పక్కాగా చూపాల్సిందే.. ఈ రూల్ తెలుసా?, లేదా?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?