Hyderabad Crime: జాగ్రత్తగా దాచి పెట్టమని ఇచ్చిన మొబైల్ ఫోన్(Mobile Phone) ను అమ్మేసుకున్నాడన్న కక్షతో స్నేహితునిపై కత్తితో దాడి చేసిన యువకుని ఉదంతమిది. విచక్షణారహితంగా పొడవటంతో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. బాలాపూర్ సీఐ సుధాకర్(CI Sudhakar) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వట్టేపల్లి వాస్తవ్యులైన రిహాన్ (17), షానవాజ్, మోయిన్, ఫర్హాన్ లు స్నేహితులు. గతంలో ఓ కేసులో అరెస్ట్ అయిన షానవాజ్ జైలుకు వెళ్లే ముందు తన సెల్ ఫోన్ ను రిహాన్ కు ఇచ్చాడు. తిరిగి వచ్చాక తీసుకుంటానని చెప్పాడు. అయితే, షానవాజ్ జైల్లో ఉన్నసమయంలో రిహాన్ దానిని అమ్మేసి డబ్బు ఖర్చు చేసుకున్నాడు.
Also Read: Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్తో అనుసంధానం.. ఒక్క క్లిక్తో రైతులకు పూర్తి భూసమాచారం!
రెచ్చిపోయిన షానవాజ్..
బెయిల్ పై విడుదలై వచ్చిన తరువాత షానవాజ్ ఫోన్ గురించి అడుగగా ఇంట్లో ఎక్కడో పెట్టి మరిచిపోయానని చెప్పాడు. కాగా,న ఆదివారం రాత్రి నలుగురు స్నేహితులు కలిసి బండ్లగూడకు వచ్చి అక్కడ మద్యం సేవించారు. తెల్లవారుఝాము 2.30గంటల వరకు పీకలదాకా తాగారు. ఆ తరువాత షానవాజ్ తన ఫోన్ గురించి ప్రశ్నించాడు. దాంతో రిహాన్, షానవాజ్ ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో రెచ్చిపోయిన షానవాజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రిహాన్ పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం మిగితా వారితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రిహాన్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: DEO VRS Issue: స్వచ్ఛంద పదవీ విరమణ బాట పడుతున్న విద్యాశాఖాధికారులు.. ఎందుకో తెలుసా..!

