VC Sajjanar: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం
VC Sajjanar ( image credit: swetcha reporter)
Telangana News

VC Sajjanar: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్​!

VC Sajjanar: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావును ప్రస్తుతం సిట్​ ఇన్​ ఛార్జ్​ గా ఉన్న హైదరాబాద్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ స్వయంగా ప్రశ్నించనున్నట్టు తెలిసింది. కాగా, బంజారాహిల్స్​ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్​ కంట్రోల్ సెంటర్​ లో  కమిషనర్​ సజ్జనార్​ సిట్​ బృందంలోని అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను సమీక్షించారు. అదే సమయంలో ఇక ముందు ఎలా విచారణ జరపాలన్న దానిపై కొన్ని మార్గదర్శకాలను సూచించినట్టుగా తెలిసింది.

ప్రభాకర్​ రావు కీలక ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం లేదు

బీఆర్​ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్​ఐబీ ఛీఫ్ గా పని చేసిన ప్రభాకర్​ రావు ప్రధాన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు అనుమతితో ఆయనను రెండోసారి కస్టోడియల్ విచారణ కోసం అదుపులోకి తీసుకున్న సిట్​ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​ లో ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇంతకు ముందులానే ప్రస్తుతం కూడా ప్రభాకర్​ రావు కీలక ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం లేదని తెలిసింది. నేనేం చేశానో అంతా పై అధికారులకు తెలుసని మాత్రమే చెబుతున్నట్టుగా సమాచారం. ఫోన్​ ట్యాపింగ్​ కోసం ఆదేశాలు ఇచ్చిన అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై ఎన్ని రకాలుగా ప్రశ్నించినా మౌనం వహిస్తున్నట్టుగా తెలియవచ్చింది.

Also Read: VC Sajjanar: తల్లిదండ్రులపై నిర్లక్ష్యం చేస్తే దబిడి దిబిడే.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రభాకర్ రావును తానే స్వయంగా ప్రశ్నించాలి

స్వయంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావును తానే స్వయంగా ప్రశ్నించాలని సిట్ ఇన్​ ఛార్జ్​ గా ఉన్న కమిషనర్ సజ్జనార్​ నిర్ణయించుకున్నట్టుగా తెలియవచ్చింది. నేడు ఆయన జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​ లోని సిట్ ఆఫీస్​ కు రానున్నట్టు సమాచారం. కాగా,  సిట్ బృందంలోని అధికారులతో సమావేశమైన కమిషనర్ సజ్జనార్​ ఇప్పటివరకు విచారణలో వెల్లడైన వివరాలను తీసుకున్నట్టుగా తెలియవచ్చింది. ఈ కేసులో అరెస్టయిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్​ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​ రావుల వాంగ్మూలాలను అధ్యయనం చేసినట్టుగా సమాచారం. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్​ రావులు తమ తమ స్టేట్​ మెంట్లలో వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రభాకర్​ రావును ప్రశ్నించనున్నట్టుగా తెలిసింది. అయినా, ప్రభాకర్ రావు నోరు తెరవక పోతే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్​ రావులను ఒక్కొక్కరిగా ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు

సంధించాలని నిర్ణయించినట్టుగా సమాచారం

ఇక, ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణ సుప్రీం కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో సిట్​ లోని ప్రతీ ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సజ్జనార్​ సూచించినట్టుగా తెలిసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ నిశితంగా విచారించాలని చెప్పినట్టు సమాచారం. అన్ని వివరాలు, ఆధారాలతో ఛార్జిషీట్​ ను పకడ్భంధీగా తయారు చేయాలని కూడా అన్నట్టుగా తెలియవచ్చింది. ఇక, నేడో…రేపో సిట్ కార్యాలయాన్ని జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​ నుంచి సీసీఎస్​ కు మార్చనున్నట్టుగా తెలియవచ్చింది. దీని కోసం ఇప్పటికే సీసీఎస్​ లో ఓ గదిని సిద్ధం చేసినట్టుగా సమాచారం.

Also Read: VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Just In

01

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

Kavitha: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట : ఎమ్మెల్సీ కవిత!

Viral Video: బెడ్‌పై ఉన్న పెషెంట్‌ని చితకబాదిన డాక్టర్.. ప్రముఖ హాస్పిటల్‌లో షాకింగ్ ఘటన.. వీడియో ఇదిగో

GHMC: డీలిమిటేషన్‌ పై ముగిసిన స్టడీ.. సర్కారుకు నివేదిక సమర్పించిన జీహెచ్ఎంసీ!

Sai Kumar: ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం