Nalgonda District: ఏసీబీ వలలో చిక్కిన చండూరు డిప్యూటీ ఎమ్మార్వో
Nalgonda District (imagecredit:swetcha)
నల్గొండ

Nalgonda District: ఏసీబీ వలలో చిక్కిన చండూరు మండలం డిప్యూటీ ఎమ్మార్వో..!

Nalgonda District: తమ తెలియకుండా తమ భూమిలో కొంత ఇతరులకు రిజిస్ట్రేషన్(Registration) చేసిన విషయమై సమాచార హక్కు చట్టం(RTI) కింద ప్రొసీడింగ్స్, ఇతర వివరాలను రికార్డుల రూపంలో ఇచ్చేందుకు రైతు నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి అందులో రూ. 20 వేలు తీసుకుంటూ నల్గొండ(Nalgonda) జిల్లా చండూరు(Chandur) మండల డిప్యూటీ ఎమ్మార్వో చంద్రశేఖర్(Chandrasekhar) గురువారం రాత్రి హైదరాబాద్(Hyderabad) బాలానగర్ చౌరస్తాలో ఏసీబీ(ACB)కి చిక్కారు. స్థానికులు, బాధితుడు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Domestic Airfare: బాబోయ్ లక్షా? హైదరాబాద్ నుంచి ఈ నగరాలకు భారీగా పెరిగిన టికెట్ ధరలు.. ఏ నగరానికి ఎంతంటే?

సమాచార హక్కు చట్టం

గట్టుప్పల్ కు చెందిన ఉస్మాన్ షరీఫ్(Usman Sharif) వ్యవసాయ భూమిలో కొంత ల్యాండ్ ఇతరులపై రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాగ వివరాలను చెప్పేందుకు అధికారులు తిరస్కరించడంతో బాధితుడు సమాచార హక్కు చట్టం కింద రికార్డులను ఇవ్వాలని కోరారు. అయితే భూమి మార్పిడి పై ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు లంచం సొమ్ములో రూ. 20 వేలు తీసుకుంటుండగా వలవేసిన ఏసీబీ(ACB) అధికారులు డీటీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు పరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Also Read: Cartier Watches Controversy: కుర్చీ పాయే వాచ్ వచ్చే.. కొత్త వివాదంలో డీకే, సిద్ధరామయ్య.. ఏకిపారేస్తున్న విపక్షాలు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?