Collector Rizwan Basha: రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా అధికారులు
Collector Rizwan Basha (image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Collector Rizwan Basha: రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి : క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్

Collector Rizwan Basha: జాతీయ ర‌హ‌దారుల‌పై రోడ్డు ప్ర‌మాదాలు, దారుణాలు జ‌రుగ‌కుండా అన్నిశాఖ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ (Collector Rizwan Basha) అన్నారు. క‌లెక్ట‌రెట్ కార్యాల‌యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాలిసిన చర్యలపై అన్ని శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌ర్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జాతీయ ర‌హ‌దారులు, ప్లై ఓవ‌ర్ల‌పై ఎక్క‌వ‌గా వాహానాలు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయ‌ని అన్నారు. ఇంత‌కు ముందు జ‌రిగిన సంఘ‌ట‌ల‌ను ఎక్కువ‌గా ఇలాంటి ప్ర‌దేశాల్లోనే జ‌రిగాయ‌ని తెలిపారు. రోడ్ల వెంట‌, బ్రిడ్జిల ద‌గ్గ‌ర‌, ప్లై ఓవ‌ర్ల స‌మీపంలో, ఇరుకైన ప్ర‌దేశాల‌ల్లో, లెక్క‌లు మించి వాహానాలు నిలుప‌డం, రోడ్డు మీద‌నే షాపుల‌కు స‌మీపంలో వాహానాల‌ను పార్కింగ్ చేయ‌డంతో ప్ర‌మాదాలు జ‌రిగి ప్రాణ న‌ష్టం అధికంగా జ‌ర‌గుతుంద‌ని వివ‌రించారు.

Also Read: Collector Rizwan Basha: స‌మాజాన్ని జాగృతం చేసిన క‌వి కాళోజీ.. క‌లెక్ట‌ర్ కీలక వ్యాఖ్యలు

ప్ర‌మాదాల హెచ్చ‌రిక బోర్డుల‌ను, లైటింగ్‌ల‌ను ఏర్పాటు చేయాలి

ఇలా ప్ర‌మాదాలు జ‌రిగి అనేక మంది ప్ర‌యాణికులు మృత్యువాత ప‌డుతున్నార‌ని, దీంతో అనేక కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయ‌ని ఆవేధ‌న చెందారు. ఇలా ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా, ప్ర‌మాదాలు జ‌రిగే ప్ర‌దేశాల్లో, బ్రిడ్జిల వ‌ద్ద‌, ప్లై ఓవ‌ర్ల వ‌ద్ద‌, యూ ట‌ర్న్‌ల వ‌ద్ద ప్ర‌మాదాల హెచ్చ‌రిక బోర్డుల‌ను, లైటింగ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రమాదాలను నివారించేందుకు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల శాఖల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. చాగల్ నుండి నిడిగొండ కి న‌డుమ ఉన్న యూ టర్న్ వద్ద లైటింగ్, హెచ్చరిక బోర్డు లు, జాతీయ ర‌హ‌దారి న‌డుమ డివైడర్ లలో లైటింగ్ ఏర్పాటు చేయాల‌ని ఆర్ అండ్ అధికారుల‌ను ఆదేశించారు.

లైటింగ్ లేని చోట వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలి

యశ్వంతాపూర్ జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డును పెంచాలని, లైటింగ్ లేని చోట వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని, జాతీయ ర‌హ‌దారి 163 పై ఆర్టీసీ బ‌స్సుల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఆప‌డంతో ప్ర‌యాణికులు ప్ర‌మాదాల బారిన ప‌డుతార‌ని హెచ‌చ‌రించారు. అందుకే బ‌స్సు స్టాప్ ల వ‌ద్ద‌నే బ‌స్సుల‌ను ఆపి ప్ర‌యాణికులు ఎక్కించుకోవాల‌ని హితువు ప‌లికారు. రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉన్న ప్ర‌దేశాలను గుర్తించి అక్క‌డ హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేస్తే వాహాన‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉంటార‌ని అన్నారు. ఏ శాఖ అధికారులు అస‌త్వం చేసినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. స‌మావేశంలో జ‌న‌గామ డీసీపీ రాజా మహేంద్ర నాయ‌క్‌, అన్ని శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Also Read: Jangaon collector: ప్ర‌జావాణిలో బాధితుల మొర‌.. స‌మ‌స్య‌లు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించండి!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?