Narendra Modi: రైతులకు గుడ్ న్యూస్..18 వేల కోట్లు ఖాతాల్లోకి జమ
Narendra Modi ( image credit: swetcha reporter)
జాతీయం

Narendra Modi: రైతులకు గుడ్ న్యూస్.. 9 కోట్ల18 వేల కోట్లు ఖాతాల్లోకి జమ.. కోయంబత్తూరులో రిలీజ్ చేసిన ప్రధాని

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త అందించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ‘సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025’ ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడుత నిధులను విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18వేల కోట్లకు పైగా నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో (డీబీటీ) జమ చేశారు.

 Also Read: Narendra Modi: బీహార్ ఘన విజయంతో బీజేపీలో ఫుల్ జోష్.. నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అంటూ..!

వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా మారుతోంది

ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 విడతల్లో 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను అందించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో గత 11 ఏళ్లలో జరిగిన సంస్కరణల గురించి వివరించారు. దేశం సహజ వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా మారుతోందని, రైతులు కనీసం ఒక్క ఎకరం భూమిలోనైనా సహజ వ్యవసాయ పద్ధతులను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్లకు పైగా సాయం అందిందని కూడా ప్రధాని తెలిపారు.

పుట్టపర్తి పవిత్ర భూమి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తొలుత సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. ఈ ప్రాంతంలో ఏదో మహత్తు ఉందని, పుట్టపర్తి పవిత్ర భూమి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపంగా జీవించారని, భౌతికంగా బాబా లేకపోయినా, ఆయన బోధనలు లక్షల మందికి సరైన మార్గాన్ని చూపాయని తెలిపారు.

విశిష్ట సేవలను ప్రధాని ప్రత్యేకం

సాయి తమ జీవితాలను సమూలంగా మార్చారని, లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని ప్రధాని అన్నారు. ప్రజల కోసం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్థిల్లాలని మోదీ ఆకాంక్షించారు. అంతకుముందు, సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించారు.

 Also ReadNarendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ

Just In

01

Ap-TG Water Disputes: 30న నీటి పంపకాలపై కీలక భేటీ.. వాదనలు వినిపిస్తారా.. చేతులెత్తేస్తారా?

CPI And CPM alliance: పురపోరులో కామ్రేడ్లు కలుస్తారా? ఒంటరిగానే పోటీ చేస్తారా? పొత్తుపై క్లారిటీ వచ్చేనా?

CM Revanth Reddy: యువతను ప్రపంచంతో పోటీ పడేల తీర్చి దిద్దుతాం.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి!

Sankranti Cockfighting: గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు.. 3 రోజుల్లో చేతులు మారిన రూ.3 వేల కోట్లు!

Supreme Court: ఇదే ఆఖరి ఛాన్స్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్‌కు డెడ్‌లైన్