Telangana Secretariat (Image Source: twitter)
హైదరాబాద్

Telangana Secretariat: సచివాలయం వద్ద ప్రమాదం.. గ్రిల్‌లో ఇరుక్కున ఉద్యోగిని కాలు

Telangana Secretariat: హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గ్రిల్ లో ప్రమాదవశాత్తు ఓ మహిళా ఉద్యోగిని కాలు ఇరుక్కుపోయింది. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్ లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాక ఆమె ఎంతో వేదన అనుభవించింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాలు బయటక రాక ఇబ్బందులు ఎదుర్కొంది.

Also Read: Kalvakuntla Kavitha: సింగరేణి ముట్టడి ఉద్రిక్తం.. రోడ్డుపై బైఠాయించిన కవిత.. అరెస్ట్ చేసిన పోలీసులు

అటుగా వెళ్తున్న తోటి ఉద్యోగులు మహిళ కాలును బయటకు తీసేందుకు యత్నించినప్పటికీ అది ఫలించలేదు. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. స్కానర్ గ్రిల్ ను కట్ చేశారు. అనంతరం ఉద్యోగిని కాలును జాగ్రత్తగా బయటకు తీశారు. మహిళ కాలుకు పెద్ద గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే స్కానర్ గ్రిల్ ను కట్ చేస్తున్నంత సేపు.. బాధితురాలు అక్కడే కూర్చుండిపోవడం గమనార్హం.

Also Read: Nashik Bus Station: బస్టాండ్‌లో ఘోరం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్

Just In

01

Duvvada Divvela Couple: దువ్వాడ దివ్వెల జంట.. పాలిటిక్స్ టు బిగ్ బాస్.. నెక్ట్స్ స్టెప్ ఇదే!

Chiranjeevi: ‘కొదమసింహం’ రీ రిలీజ్.. రామ్ చరణ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్!

Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?

Minister Sridhar babu: ఏఐతో ఉద్యోగాలు పోతాయా.. ఇది కేవలం అపోహే: మంత్రి శ్రీధర్ బాబు

Bandi Sanjay: మావోయిస్టులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?