Fake Documents Scam: నకిలీ పత్రాలు సృష్టించి 47 లక్షల కుచ్చు టోపీ పెట్టిన ఘటన నిజామాబాద్(Nizamabad)లో కలకలం రేపింది. బోర్గం మీసేవా(Mee Seva) కేంద్రంగా ఫేక్ డాక్యుమెంట్రీ(Fake documentary) తయారు చేశాడు. దీంతో లేని భూమిని ఉన్నట్లుగా చూపించాడు. అనంతరం కనకయ్య(Kanakaiah) అనే ఓ ప్రొఫెసర్ ను నమ్మించాడు. ఈ ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా ఫ్రోఫెసర్ నుండి 47 లక్షల వసూలు చేశాడు మీ సేవ నిర్వాహకుడు రవి(Ravi). దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ప్రొఫెసర్ కనకయ్య పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ప్రస్తుతం చిలుక సాయిలు(Chiluka Sailu), షేక్ అహ్మద్ నబీ(Sheikh Ahmed Nabi) అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి తరలించారు. ఈ సంఘటనలో ప్రధాన సూత్రధారి మీసేవా నిర్వాహకుడు రవి పరారీలో ఉన్నాడు.
Also Read: Ginning Millers Strike: పత్తిరైతులకు గుడ్న్యూస్.. జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల చర్చలు సఫలం
రిజిస్ట్రేషన్ అధికారుల హస్తం
అయితే ఈ నఖిలీ పత్రాల తయారీలో రిజిస్ట్రేషన్ కార్యాలయ(Registration office) అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు, భూ యజమాని లేని స్థలాలను గుర్తించి ఫేక్ డాక్యుమెంట్స్ చేయడంలో మీ సేవ నిర్వాహకుడు రవి(Ravi) సిద్ధహస్తుడు అని తెలుస్తుంది. గతంలోనూ వివిధ వివాదాల్లో రవి అనే వ్యక్తి మీ సేవ సీజ్ అయినట్లు అక్కడి స్థానికులు అనుకుంటున్నట్టు సమాచారం. దీంతో చాలా వివాదాల్లో మీ సేవ నిర్వాహకుడు రవి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
Also Read: Hyper Aadi: సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి హైపర్ ఆది స్వీట్ వార్నింగ్.. ముందు ఇది పోవాలి..
