Currency Scam (iagecredit:swetcha)
క్రైమ్

Currency Scam: ఓరి నాయనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి దందా.. ఎంచేశారంటే..?

Currency Scam: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి మరీ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ప్రధాన సూత్రధారులతో సహా మొత్తం 8 మంది సభ్యులు ఉన్న నెట్‌వర్క్‌ను సౌత్‌‌వెస్ట్‌ జోన్​టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.75 లక్షల విలువ చేసే నకిలీ రూ.500 నోట్లు, కారు, మూడు ద్విచక్ర వాహనాలు, 9 సెల్​ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, తాండూరుకు చెందిన కస్తూరి రమేశ్​బాబు (35) వృత్తిరీత్యా కారు మెకానిక్. ఇతను తన సోదరి రామేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. తేలికగా డబ్బు సంపాదించాలనే దురాశతో రమేశ్​చాలా కాలంగా నకిలీ కరెన్సీ దందా చేస్తున్నాడు.

ఇంట్లోనే నకిలీ కరెన్సీ..

గతంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్, హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, గోపాలపురం పోలీసులకు ఇతను పట్టుబడ్డా కూడా తన అక్రమ దందాను మాత్రం ఆపలేదు. రమేశ్​ తన సోదరితో కలిసి ఇంట్లోనే నకిలీ కరెన్సీని తయారుచేస్తున్నాడు. ముందుగా అసలైన రూ.500 నోటును స్కాన్ చేసి, దాన్ని ఫోటో షాప్‌లో ఎడిట్ చేస్తాడు. ఆ తర్వాత జే.కే. బాండ్ పేపర్‌పై ప్రింట్లు తీసుకుంటాడు. అనంతరం, ఆకుపచ్చ రంగు గిఫ్ట్​ప్యాక్ పేపర్‌ను కత్తిరించి, నిజమైన నోట్లపై ఉండే గ్రీన్ కలర్ సెక్యూరిటీ థ్రెడ్‌లా అతికిస్తాడు. హీట్ గన్‌తో ఆరబెట్టిన తర్వాత, తయారుచేసిన నకిలీ నోట్లను కట్టలుగా కడతాడు.

Also Read: Happy Childrens Day: మీ పిల్లలకు ఇలా ప్రేమగా విషెస్ చెప్పండి!

నెట్ వర్క్ ఇలా..

ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉన్న రమేశ్ అసలు రూ.500 నోటుకు నాలుగు నకిలీ నోట్లు కావాలనుకునేవారు తనను సంప్రదించాలంటూ కామెంట్ బాక్స్‌లో ఫోన్ నెంబర్‌తో సహా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన సులేమాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ వహీద్ (21), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ (21)లు రమేశ్ బాబును సంప్రదించి, 1:4 పద్దతిలో నకిలీ కరెన్సీ తీసుకున్నారు. అనంతరం వీరు 1:3 పద్దతిలో సులేమాన్​నగర్‌కు చెందిన సొహైల్ (21), బహదూర్‌పురా వాస్తవ్యుడు ఫహాద్ (23)కు ఈ నోట్లను అమ్మివేశారు. ఈ ఇద్దరూ 1:2 పద్దతిలో కిషన్‌బాగ్ నివాసి షేక్ ఇమ్రాన్ (23), ఉప్పుగూడ వాస్తవ్యుడు ఒమర్ ఖాన్ (23)కు ఇచ్చారు. చివరగా, ఇమ్రాన్, ఒమర్ ఖాన్ కలిసి కిషన్‌బాగ్ నివాసి, బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్​విద్యార్థి సయ్యద్ అల్తమష్ అహమద్‌తో కలిసి ఈ నకిలీ నోట్లను ఫస్ట్ లాన్సర్ ఈద్గా గ్రౌండ్ వద్ద మార్చడానికి ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారాన్ని సేకరించిన ఇన్‌స్పెక్టర్లు మల్లేశ్, సంతోష్ కుమార్, రాంబాబు, ఎస్ఐ ప్రీతిరెడ్డితోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముగ్గురు వెల్లడించిన వివరాల ఆధారంగా మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసిన మెహదీపట్నం పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్​ చేశారు.

Also Read: Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

Singareni: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డ్.. స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో ఎంపిక!

Soy Milk vs Cow Milk: సోయా పాలు vs ఆవు పాలు.. వీటిలో ఏది ఆరోగ్యకరం?

Transport Department: రవాణా శాఖ ఆఫీసర్ల కొరడా.. రెండ్రోజుల్లో 1050 కేసులు.. ఓవర్ లోడ్‌పై కఠిన చర్యలు!

Breast Cancer: యువతుల్లో పెరుగుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు ఇవే

Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్