New Delhi: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ఆందోళనలో ప్రజలు
New Delhi (imagecredit:twitter)
జాతీయం

New Delhi: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ఆందోళనకు దిగిన ప్రజలు

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీ(New Delhi)లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. రోజురోజుకు అక్కడ నాణ్యత క్షీణిస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, ఇండియా గేట్(India Gate) దగ్గర భారీ నిరసన చేపట్టారు. ఇందులో పర్యావరణ వేత్తలు, ఇతర ప్రజలు పాల్గొన్నారు. ఈ నిరసనపై పర్యావరణవేత్తలు మాట్లాడుతూ, ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బ తింటున్నాయని అన్నారు.

Also Read: Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?

పిల్లల జీవితకాలం..

స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే ఢిల్లీ పిల్లల జీవితకాలం పదేళ్లు తక్కువగా ఉన్నదని వివరించారు. అందుకే తల్లిదండ్రులు, ప్రజలు ఆదివారం రోడ్డెక్కారని తెలిపారు. దీనిపై వివరించేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ అడిగితే నిరాకరించారని అన్నారు. కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్వచ్ఛమైన గాలి(Fresh air)ని అందించడంలో ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు మండిపడ్డారు. మరోవైపు, ముందస్తు అనుమతి లేకుండా ఇండియా గేట్ దగ్గర నిరసన చేపట్టిన కొందరిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.

Also Read: SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?