Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాయలేడి.. ఎట్టకేలకు అరెస్ట్
Nizamabad Crime (Image Source: Reporter)
క్రైమ్

Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Nizamabad Crime: భూములు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి అక్రమంగా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న మహిళను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన స్వర్ణ ప్రమీల.. మోపాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు వ్యక్తులకు మూడు ఎకరాల భూమి ఇప్పిస్తానని చెప్పి నమ్మించింది. వారి వద్ద నుంచి రూ.38,15,000 డబ్బులు తీసుకొని మోసం చేసింది.

Also Read: Ind vs Aus 4th T20: వారెవా.. మ్యాచ్‌ను తిప్పేసిన స్పిన్నర్లు.. నాలుగో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు నిందితురాలిని గురువారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి బాధితులు సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. సదరు మహిళ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించాలని చూసే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఆయన వెంట మోపాల్ ఎస్సై సుస్మిత, ఇతర సిబ్బంది ఉన్నారు.

Also Read: Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎన్నడూ గెలవలేదు.. బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి.. ఓటర్లకు కిషన్ రెడ్డి రిక్వెస్ట్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?