Husband-Kidnap-Case (Image source Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

భర్తను కిడ్నాప్​ చేయించిన మహిళ

ఆమెతో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్​

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆస్తి కోసం కట్టుకున్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించింది ఓ ఇల్లాలు. పత్రాలపై సంతకాలు తీసుకోగానే హత్య కూడా చేయించాలని కుట్ర పన్నింది. అందుకోసం ఏకంగా కోటి రూపాయలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, కేసులో చాకచక్యంగా దర్యాప్తు జరిపిన అంబర్ పేట పోలీసులు ఆమెతో పాటు సుపారీ గ్యాంగులోని 9 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఈస్ట్ జోన్​ డీసీపీ బాలస్వామి మంగళవారం, అదనపు డీసీపీ జే.నర్సయ్య, ఏసీపీ హరీష్​ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో  వివరాలు వెల్లడించారు. అమెరికాలో కొన్నేళ్లపాటు సాఫ్ట్​ వేర్ ఇంజనీర్‌గా పని చేసి హైదరాబాద్ వచ్చిన​ శ్యామ్ అనే వ్యక్తి తన రెండో భార్య ఫాతిమాతో కలిసి డీడీ కాలనీలో నివాసముంటున్నాడు.

కాగా, గత నెల 29న రాత్రి 8.30గంటల సమయంలో శ్యామ్​ కనిపించకుండా పోయాడు. దాంతో అతడి భార్య ఫాతిమా అంబర్​ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్​ చేశారని పేర్కొంది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు శ్యామ్​ కోసం గాలింపు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపారు. పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే గతనెల 31న శ్యామ్​ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. అతను బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.

Read Also- Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

విచారణలో ఏం చెప్పారంటే

విచారణలో తన మొదటి భార్య మాధవి ఈ కిడ్నాప్ చేయించినట్టు శ్యామ్ వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు మాధవిని బండ్లగూడ జాగీర్‌లోని ఆమె ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆస్తి కోసం తానే శ్యామ్‌ను కిడ్నాప్​ చేయించినట్టుగా అంగీకరించింది. దీని కోసం వుండి దుర్గా వినయ్, కట్టా దుర్గాప్రసాద్, కాటమోని పురుషోత్తం, సందోలు నరేశ్​ కుమార్, జీ.ప్రీతి, ఎల్​.సరిత, కొశకోలు పవన్​ కుమార్​, నారాయణ రిషికేశ్ సింగ్​, పిల్లి విజయ్ తోపాటు మరికొందరికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలిపింది. తాను చెప్పినట్టుగా చేస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పినట్టుగా వివరించింది.

Read Also- Komati Reddy: జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌పై పంచ్‌లు

గ్యాంగ్​ సభ్యుల అరెస్ట్​…

ఈ క్రమంలో పోలీసులు సుపారీ గ్యాంగులోని దుర్గా వినయ్, కట్టా దుర్గాప్రసాద్, కాటమోని పురుషోత్తం, సందోలు నరేశ్​ కుమార్, జీ.ప్రీతి, ఎల్​.సరిత, కొశకోలు పవన్​ కుమార్​, నారాయణ రిషికేశ్ సింగ్​, పిల్లి విజయ్ లను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో మొదట మంత్రి శ్యామ్​ ను బండ్లగూడ ప్రాంతం నుంచి కిడ్నాప్​ చేయాలని ప్లాన్​ చేసినట్టుగా వెల్లడైంది. అక్కడ వీలు కాకపోవటంతో బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ నుంచి కిడ్నాప్​ చేయాలని పథకం వేసినట్టుగా తేలింది. చివరకు డీడీ కాలనీలో రెక్కీ జరిపి అక్కడి నుంచి వాహనాలు మారుస్తూ విజయవాడకు తీసుకెళ్లినట్టుగా వెల్లడైంది. బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంక్​ నుంచి 10 లక్షల రూపాయలు డ్రా చేయించేందుకు శ్యామ్‌ను ఇక్కడికి తీసుకురాగా అతను తప్పించుకున్నట్టుగా తెలిసింది. కేసులోని మిస్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ కిరణ్​ కుమార్​, డీఐ మహ్మద్​ హఫీజుద్దీన్​, ఎస్​ఐలు సురేశ్​ కుమార్, తరుణ్​ కుమార్​, హెడ్​ కానిస్టేబుళ్లు రాములు, మునిరత్నం, కానిస్టేబుళ్లు విక్రమ్​, రవి, శివ, శ్రీధర్​, భరత్, వంశీ, సుధీర్​, అరుణ్​, మహిళా హెడ్​ కానిస్టేబుల్​ భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్ రాధికను డీసీపీ బాలస్వామి అభినందించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..