Rajasthan News: ఐసీయూలో మంటలు.. అగ్నికి ఆహుతైన పేషెంట్లు
Rajasthan News (Image Source: Twitter)
జాతీయం

Rajasthan News: ఆస్పత్రిలో ఘోరం.. ఐసీయూలో చెలరేగిన మంటలు..ఆహుతైన అగ్నికి పేషెంట్లు

Rajasthan News: రాజస్థాన్ జైపూర్ లోని సావాయి మాన్ సింగ్ ఆస్పత్రి (Sawai Man Singh Hospital)లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ట్రామా సెంటర్ లో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో ఉన్న ఆరుగురు పేషెంట్లు మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఐసీయూలో 11 మంది రోగులు

ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఐసీయూలో 11 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. స్టోరేజ్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు మృతులను పింటూ, దిలీప్, శ్రీనాథ్, రుక్మిణి, ఖుర్మా, బహదూర్ గా గుర్తించినట్లు తెలిపారు. అయితే పక్కన ఉన్న మరో ఐసీయూలో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నారని.. వారందరినీ సురక్షితంగా కాపాడినట్లు వివరించారు.

ఐసీయూ పరికరాలు దగ్దం

మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా.. సావాయి మాన్ సింగ్ ఆస్పత్రి భవనంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పొగ వేగంగా వ్యాపించడంతో ఆస్పత్రిలోని మిగతా రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళనలు చెలరేగాయి. పేషెంట్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఐసీయూ పరికరాలు, రక్త నమూనా ట్యూబులు, ఇతర వస్తువులు మంటల్లో దగ్ధమైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. రోగులు, వారి బంధువులను మంటల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను 2 గంటల్లోనే అదుపులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?

ఆసుపత్రి వార్డ్ బాయ్ వికాస్ మాట్లాడుతూ ‘మేము ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం గురించి తెలిసింది. వెంటనే లోపలికి వెళ్లి రోగులను రక్షించడానికి ప్రయత్నించాం. ముగ్గురు లేదా నలుగురిని రక్షించగలిగాం. కానీ మంటలు పెరిగిన తర్వాత లోపలికి వెళ్లడం సాధ్యం కాలేదు’ అని చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ తర్వాత ఆస్పత్రి వద్దకు ప్రవేశించినప్పటికీ మంటలు, పొగ ఎక్కువగా ఉండటంతో వార్డులోకి ప్రవేశించలేకపోయినట్లు వివరించారు.

Also Read: Gold Rate Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

సీఎం సమీక్ష

మరోవైపు ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం భజన్ లాల్ శర్మ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి జవహర్ సింగ్, ఎంపీ జోగారాం పటేల్ తో కలిసి ట్రామా సెంటర్ కు చెరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముందుగా హోమంత్రి, ఎంపీ ఆస్పత్రి వద్దకు చేరుకోగా వారి వద్ద పేషెంట్లు, బంధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద సమయంలో ఆస్పత్రి సిబ్బంది పారిపోయారని పేర్కొన్నారు. అలాగే ప్రమాదం జరిగిన విషయాన్ని కూడా ఇతర వార్డుల్లోని పేషెంట్లకు తెలియజేయలేదని వాపోయారు. ‘పొగ వస్తోంది.. ఎందుకు?’ అని ప్రశ్నించినా సిబ్బంది పట్టించుకోలేదని ఒక బంధువు చెప్పుకొచ్చారు.

Also Read: Wedding: ఇది ఆరంభం మాత్రమే సోదరా.. ముందుంది ముసళ్ల పండగ.. పెళ్ళికి రూ.15 లక్షలు ఉండాల్సిందేనా.. వీడియో వైరల్

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!