CV Anand( IMAGE CREDIT: TWITTER)
హైదరాబాద్

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

CV Anand: గంగా జమున తెహజీబ్ కు ప్రతీక అయిన హైదరాబాద్(Hyderabad) లో జరిగే ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలేనని కమిషనర్ సీ.వీ.ఆనంద్(CV Anand) అన్నారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీరామ నవమి శోభాయాత్ర.. ఇలా ప్రతీ పండుగలో లక్షలాది మంది పాల్గొంటారని చెప్పారు. ముందస్తు ప్రణాళిక, సమర్థ కార్యాచరణ, పకడ్భందీ భద్రతా ఏర్పాట్లు చేసినపుడే శాంతిభద్రతలను కాపాడగలమన్నారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న 170మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను సందర్శించారు.

 Also Read: Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

ప్రశాంతంగా జరిగేలా చూడటం ఛాలెంజ్

ఈ సందర్భంగా సీపీ ఆనంద్(CV Anand) పదేళ్లుగా హైదరాబాద్ లో తాను పని చేసిన అనుభవాలను పంచుకున్నారు. తాను గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని చెప్పారు. పోలీస్ కమిషనర్‌గా నాలుగోసారి అని తెలిపారు. భిన్న మతాలు, సంస్కృతులకు ఆలవాలమైన హైదరాబాద్ దేశంలోని సున్నితమైన నగరాల్లో ఒకటని చెప్పారు. అందుకే ప్రతీ పండుగ ప్రశాంతంగా జరిగేలా చూడటం ఛాలెంజ్ గా ఉంటుందన్నారు.

పండుగల సందర్భంగా తొక్కిసలాటలు జరగకుండా అమలు చేస్తున్న చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆన్‌లైన్ అనుమతి ఫారాలు, విగ్రహాలకు జియోట్యాగింగ్, డ్రోన్‌లు, యాప్‌లు, సీసీ కెమెరాల వాడకం, మల్టీ-ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి సాంకేతికతను ఎలా వినియోగించుకుంటున్నామో వివరించారు. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు రామ్ నివాస్ సేపట్, కల్మేశ్వర్ సింగేన్వార్ శ్రీమతి పుష్ప తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనం ప్రశాంతం.. డీజీపీ

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్(DGP Dr. Jitender) చెప్పారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైందని.. నాలుగు గంటల్లోపు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుందని డీజీపీ వివరించారు. రాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. త్వరగా నిమజ్జనం పూర్తి కావటానికి ప్రజలు సహకరించాలని కోరారు. డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్ లోని ఐసీసీసీ లో కంట్రోల్ రూం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నిమజ్జన యాత్రాలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

ఫలించిన పోలీస్ వ్యూహం… నిమజ్జనం ప్రశాంతం

పోలీస్ వ్యూహం ఫలించింది. వినాయక నిమజ్జన మహా ఊరేగింపు ప్రశాంతంగా సాగుతోంది. ఎప్పటిలానే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా సాగిన విషయం తెలిసిందే. మూడు కమిషనరేట్ల పరిధుల్లో రెండున్నర లక్షలకు పైగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. శనివారం నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ఒక అంచనా ప్రకారం ఇరవై లక్షల మందికి పైగా వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన పోలీస్ ఉన్నతాధికారులు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్లలో దాదాపు యాభై అయిదు వేల మందికి పైగా బందోబస్తు విధులు నిర్వర్తించారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులతో పికెట్లు ఏర్పాటు చేశారు. గస్తీని ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లోని వార్ రూం నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. పాతబస్తీ నుంచి అనుకున్న దానికన్నా ఆలస్యంగా నిమజ్జన ఊరేగింపు మొదలైనా ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.

కమాండ్ కంట్రోల్ లో మీడియాతో మాట్లాడిన కమిషనర్ నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా సాగుతున్నట్టు చెప్పారు. తాము ఇచ్చిన సూచనలను పాటించి నిర్వాహకులు సహకరించారని అన్నారు. పాతబస్తీ నుంచి ఊరేగింపు అఫ్జల్ గంజ్ దాటిసరికి శనివారం అర్ధరాత్రి దాటుతుందని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద నలభై క్రేన్ల ద్వారా విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నట్టు తెలిపారు. తొమ్మిది డ్రోన్ల ద్వారా ఊరేగింపు కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్టు చెప్పారు. శనివారం రాత్రి 8.30 గంటల వరకు 650 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు తెలిపారు. మరో 4వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందని చెప్పారు. అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేసరికి ఆదివారం అర్ధరాత్రి దాట వచ్చని చెప్పారు.

 Also Read: CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

సీబీఐ డైరెక్టర్ కు అస్వస్థత అపోలో ఆస్పత్రిలో చికిత్స

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(CBI Director Praveen Sood) అస్వస్థతకు లోనయ్యారు. దాంతో ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.  హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్రవీణ్ సూద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసు గురించి చర్చించినట్టు తెలిసింది. సమావేశం తర్వాత ఆయన దైవ దర్శనార్థం శ్రీశైలం వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ చేరగానే అపోలో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. అనారోగ్యానికి కారణాలు తెలియలేదు. అయితే, ప్రవీణ్ సూద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలిసి పలువురు సీబీఐ అధికారులు హాస్పిటల్ వెళ్లి ఆయనను పరామర్శించారు.

 Also Read: Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Just In

01

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?