Crime News: గంజాయి దందా చేస్తున్న సెక్యూరిటీ గార్డు(Security guard)ను ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 7.2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్(Bihar) రాష్ట్రానికి చెందిన అర్జున్ కుమార్(Arjun Kumar) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. అమృత్ కపాడియా నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. బీహార్ నుంచే ఇక్కడకు వచ్చి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రాహుల్ పండరితో కొన్ని రోజుల క్రితం అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి తేలికగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గంజాయి తెస్తూ తెలిసిన వారికి అమ్ముతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగరాజు(CI Ngaraju) సిబ్బందితో కలిసి అర్జున్ కుమార్ ఇంటిపై దాడి చేసి గంజాయిని సీజ్ చేశారు. పరారీలో ఉన్న రాహుల్ పండరి(Rahul Pandari) కోసం గాలిస్తున్నారు.
ధూల్ పేటలో..
ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏ టీం పోలీసులు ధూల్ పేటలో వ్యక్తిని అరెస్ట్ చేసి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి జియాగూడ రోడ్డులో తనిఖీలు చేపట్టారు. రాధాకృష్ణ గోశాల వద్ద ధన్ రాజ్ సింగ్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దందాతో జామ్ వాలా అనిల్ సింగ్ కు కూడా సంబంధం ఉన్నట్టు తేలటంతో అతనిపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read: Min Komati Reddy: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. అలా చేయమంటున్న మంత్రి..?
తుని నుంచి గంజాయి తెస్తూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుంచి గంజాయి తెస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్న ముగ్గురిని ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.109 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్ లో ఉంటున్న వరుణ్ కుమార్ అనే యువకుడు కొన్ని రోజులుగా తుని నుంచి గంజాయి తీసుకు వస్తూ సాయి మణికంఠ, బన్నీల ద్వారా పీజీ హాస్టల్ పరిసర ప్రాంతాల్లో అమ్మిపిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందగా సీఐ సుభాష్ చందర్, ఎస్ఐలు అఖిల్, వెంకట్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి గంజాయితోపాటు రెండు స్కూటీలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Telangana Assembly: కేసీఆర్ అసెంబ్లీ వస్తారా?.. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే?