Urea Shortage( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు

Urea Shortage: వానాకాలం పంటల కోసం అత్యవసరమైన యూరియా(Urea)ఎరువు కోసం రైతులు(Farmers)తొర్రూరులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  తెల్లవారుజామునే అమ్మపురం రోడ్డులోని పిఎసిఎస్ భవనం ఎదుట రైతులు(Farmers) క్యూ కట్టారు. గంటల తరబడి ఎదురు చూసినా… ఒక్కో బస్తా కూడా దొరకని పరిస్థితి. రెండు బస్తాలు యూరియా తీసుకోవాలంటే నానో లింక్ తప్పనిసరి అని పెట్టిన నిబంధన రైతుల(Farmers) ఆగ్రహానికి కారణమైంది.

 Also Read:Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం

క బస్తా ఎరువు ఇవ్వండి సార్… అంటూ కాళ్లు పట్టుకున్న రైతులు

ఒక బస్తా ఎరువు ఇవ్వని అంటూ పిఎసిఎస్ అధికారుల కాళ్లు మొక్కుతున్న రైతులు మనసు పెట్టి పంట పండించే రైతు(Farmers) ఎరువు కోసం ఇంత అవమానం పడాలా..? అంటూ అక్కడున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో అందించకపోవడం వల్ల రైతుల(Farmers)కు ఇబ్బందులకు గురవుతున్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితి

రైతులు(Farmers) మండిపడుతూ…ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూల్లో నిలబడి చివరికి రెండు సంచులు మాత్రమే ఇస్తున్నారు. మిగతా అవసరాలు ఎక్కడి నుంచి తీర్చుకోవాలి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనే రైతుల(Farmers)పై ఇంతటి దౌర్జన్యం జరుగుతోందని ఆరోపించారు. ముందుగానే సరిపడా యూరియా (Urea)నిల్వలు చేయకపోవడమే ఈ గందరగోళానికి కారణమని రైతులు (Farmers)విరుచుకుపడ్డారు. పోలీసుల బందోబస్తులో ఎరువులు పంచడం రైతులకు మరింత అవమానం కలిగించిందని స్థానికులు మండిపడ్డారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?