Sports News | ఫైనల్‌లో సింధూకి మళ్లీ నిరాశే  
PV Sindhu Loses To Carolin Marin Yet Again
స్పోర్ట్స్

Sports News: ఫైనల్‌లో సింధూకి మళ్లీ నిరాశే  

PV Sindhu Again Disappointed In The Final: మ‌లేషియా మాస్టర్స్ సూప‌ర్ 500 టోర్నీ ఫైన‌ల్లో టైటిల్‌ని సాధించడం కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న‌ భార‌త స్టార్ ష‌ట్ల‌ర్‌, తెలుగుతేజం పీవీ సింధుకు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో ఆడిన పీవీ సింధు ఓట‌మి చ‌విచూసింది.

ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16,5-21,16-21 తేడాతో సింధుకి ఊహించని షాక్‌ తగిలింది. ఈ ఫైనల్‌లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైంది. మొదటి రౌండ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు, ఆ తర్వాత రెండు, మూడు రౌండ్ల‌లో ప్ర‌త్య‌ర్ధి నుంచి గ‌ట్టి పోటీని ఎదుర్కొంది. రెండో రౌండ్ ముగిసేస‌రికి ఇరువురు చెరో విజ‌యంతో సమంగా నిల‌వ‌గా ఫ‌లితాన్ని తెల్చే మూడో రౌండ్‌లో ప్ర‌త్య‌ర్ధి వాంగ్ జీయీ చెల‌రేగిపోయి సింధుకి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా టైటిల్‌ను ఎగ‌రేసుకుపోయింది.

Also Read:అరుదైన రికార్డు సాధించిన ప్లేయర్

దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు గట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లైంది. తన ఓటమి పట్ల పలువురు సింధూకి అధైర్యపడవద్దని పలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా గెలుపోటములు సర్వసాధారణమని తరువాత ఆటలో తన ఆటని ప్రదర్శించాలని కోరుతున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..