KTR on Congress govt: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt) గ్యారెంటీగా ఖతం పట్టించిందని మండిపడ్డారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
రూ.10,583 కోట్ల రెవెన్యూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయన్నారు. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పుడు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయిందని తెలిపారు.
రూ.20,266 కోట్లు అప్పు
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతీ రోజు అప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పుగా తీసుకుందని తెలిపారు. వార్షిక లక్ష్యంలో ఇది 37.5 శాతం అని, కొత్తగా ఏ రోడ్లు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులను ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Rad: Bhoobharati Act: గుట్టలుగా భూభారతి దరఖాస్తులు.. గడువు దగ్గర పరిష్కారం దూరం